24,000 మంది భారతీయులు మాత్రమే ఓటర్లుగా నమోదు
- August 13, 2017
భారతదేశంలో ఓటు వేసేందుకోసం విదేశాల్లోని భారతీయులు అతి తక్కువగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇలా నమోదు చేసుకున్నవారి సంఖ్య 23,556 మాత్రమే ఉంది. కేరళకు చెందిన 364 మంది, పంజాబ్కి చెందిన 14 మంది మాత్రమే ఓటు హక్కు కోసం పేర్లను నమోదు చేసుకున్నట్లు ఎలక్షన్ కమిషన్ వివరాల ప్రకారం తెలియవస్తోంది. విదేశాల్లో ఉంటున్న వ్యక్తి, భారతీయ పౌరసత్వాన్ని మాత్రమే కలిగి ఉంటే భారతదేశంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని ఎన్నికల కమిషన్ చెబుతోంది. పాస్పోర్ట్లో ఉన్న వివరాల ప్రకారమే ఆయా వ్యక్తులు ఓటేయడానికి నియోజకవర్గాన్ని నిర్ణయిస్తారు. ఇదివరకటి నిబంధనల ప్రకారం ఓటు హక్కుని ప్రవాస భారతీయులు వినియోగించుకోవడం ఓ ప్రసహనంగా ఉండేది. అయితే ఇప్పుడు వాటిని కొంతమేర సడలించడంతో, ప్రవాస భారతీయులూ సులువుగా తమ ఓటుకు హక్కుని వినియోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాల్ని ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పొందుపర్చారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









