24,000 మంది భారతీయులు మాత్రమే ఓటర్లుగా నమోదు
- August 13, 2017
భారతదేశంలో ఓటు వేసేందుకోసం విదేశాల్లోని భారతీయులు అతి తక్కువగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇలా నమోదు చేసుకున్నవారి సంఖ్య 23,556 మాత్రమే ఉంది. కేరళకు చెందిన 364 మంది, పంజాబ్కి చెందిన 14 మంది మాత్రమే ఓటు హక్కు కోసం పేర్లను నమోదు చేసుకున్నట్లు ఎలక్షన్ కమిషన్ వివరాల ప్రకారం తెలియవస్తోంది. విదేశాల్లో ఉంటున్న వ్యక్తి, భారతీయ పౌరసత్వాన్ని మాత్రమే కలిగి ఉంటే భారతదేశంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని ఎన్నికల కమిషన్ చెబుతోంది. పాస్పోర్ట్లో ఉన్న వివరాల ప్రకారమే ఆయా వ్యక్తులు ఓటేయడానికి నియోజకవర్గాన్ని నిర్ణయిస్తారు. ఇదివరకటి నిబంధనల ప్రకారం ఓటు హక్కుని ప్రవాస భారతీయులు వినియోగించుకోవడం ఓ ప్రసహనంగా ఉండేది. అయితే ఇప్పుడు వాటిని కొంతమేర సడలించడంతో, ప్రవాస భారతీయులూ సులువుగా తమ ఓటుకు హక్కుని వినియోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాల్ని ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పొందుపర్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







