తీవ్రవాదుల ఏరివేత: ప్రజల పునరావాసానికి ఏర్పాట్లు
- August 14, 2017
అల్ అవామియా: కాతిఫ్లోని అల్ అవామియాలోగల అల్ ముసావారాలో భద్రతాదళాలు తీవ్రవాదుల్ని పూర్తిగా ఏరివేయడంతో మూడు నెలల తర్వాత ప్రజలు తిరిగి ఆ ప్రాంతానికి వెళ్ళేందుకు మార్గం సుగమం అవుతోంది. సౌదీ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్ పూర్తిగా ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి. కొన్నాళ్ళుగా ఇక్కడ తిష్టవేసిన తీవ్రవాదులు, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడంఓతపాటుగా ఇక్కడినుంచే దేశంపై దండెత్తే కార్యక్రమాలు చేపట్టారు. వారిని పూర్తిగా భద్రతాదళాలు నిర్వీర్యం చేయగలిగాయి. సుమారుగా 428 కుటుంబాలు ఈ ప్రాంతం నుంచి తీవ్రవాదుల కారణంగా వేరే ప్రాంతాలకి తరలి వెళ్ళాయి. వారందరికీ ప్రభుత్వం తిరిగి అల్ ముసావారా విలేజ్లో పునరావాసం కల్పిస్తోంది. కొన్ని వారాల్లోనే పూర్తిగా ఇక్కడి భవనాల్ని పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే చాలావరకు కొత్త నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వాటిల్లో కొన్ని పూర్తయి, పునరావాసానికి అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!









