తీవ్రవాదుల ఏరివేత: ప్రజల పునరావాసానికి ఏర్పాట్లు
- August 14, 2017
అల్ అవామియా: కాతిఫ్లోని అల్ అవామియాలోగల అల్ ముసావారాలో భద్రతాదళాలు తీవ్రవాదుల్ని పూర్తిగా ఏరివేయడంతో మూడు నెలల తర్వాత ప్రజలు తిరిగి ఆ ప్రాంతానికి వెళ్ళేందుకు మార్గం సుగమం అవుతోంది. సౌదీ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్ పూర్తిగా ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి. కొన్నాళ్ళుగా ఇక్కడ తిష్టవేసిన తీవ్రవాదులు, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడంఓతపాటుగా ఇక్కడినుంచే దేశంపై దండెత్తే కార్యక్రమాలు చేపట్టారు. వారిని పూర్తిగా భద్రతాదళాలు నిర్వీర్యం చేయగలిగాయి. సుమారుగా 428 కుటుంబాలు ఈ ప్రాంతం నుంచి తీవ్రవాదుల కారణంగా వేరే ప్రాంతాలకి తరలి వెళ్ళాయి. వారందరికీ ప్రభుత్వం తిరిగి అల్ ముసావారా విలేజ్లో పునరావాసం కల్పిస్తోంది. కొన్ని వారాల్లోనే పూర్తిగా ఇక్కడి భవనాల్ని పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే చాలావరకు కొత్త నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వాటిల్లో కొన్ని పూర్తయి, పునరావాసానికి అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







