ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ బేఖాతర్
- August 15, 2017
అబుదాబీ: 30 ఏళ్ళ లోపు మహిళలు మెయిడ్స్గా పనిచేయడానికి వీల్లేదంటూ ఖచ్చితమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు భారతదేశంలో ఉన్నా, ఆ నిబంధనల్ని బేఖాతరు చేస్తూ విజిట్ వీసాతో యూఏఈలోకి ప్రవేశించి, ఆ తర్వాత మెయిడ్స్గా మారుతున్న 30 ఏళ్ళలోపు మహిళల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అక్కడ వారికి అనేక సమస్యలు తలెత్తడంతో, యజమానిపై ఆరోపణలు చేస్తూ, అధికారుల సహాయం కోరుతుండడంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతి నెలా ఇలాంటి కేసులు 15 నుంచి 20 వరకు తమ దృష్టికి వస్తున్నాయని కాన్సులర్ ఆఫ్ కమ్యూనిటీ ఎఫైర్స్, ఇండియన్ ఎంబసీ - అబుదాబీ దినేష్కుమార్ చెప్పారు. ఇండియన్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ కాని కొందరు ఏజెంట్స్ ఈ తరహా అక్రమాలకు తావిస్తున్నట్లు ఆయన వివరించారు. నిబంధనల్ని మరింత కఠినతరం చేయడంతోపాటుగా, మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సి ఉందనీ, తమ దృష్టికి వచ్చే కేసుల పరిష్కారంలో మానవీయ కోణంతో వ్యవహరిస్తున్నామని తెలిపారు కుమార్.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







