అబుదాబీలో ఇండియా, పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవాల సెలబ్రేషన్స్
- August 15, 2017
ఆగస్ట్ 14న పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం కావడం, ఆగస్ట్ 15వ తేదీ భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అధికారులు, ఆయా దేశాల నుంచి వచ్చినవారికి ప్రత్యేకంగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ పలు కార్యక్రమాలు చేపట్టారు. ఫ్లాష్ మాబ్స్, ఆయా దేశాల పతాకాలతో కూడిన బెలూన్స్ని ఎగరవేయడం వంటివి ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేశారు. దీంతో ఇరు దేశాలకు చెందినవారూ అబుదాబీ విమానాశ్రయంలో తమకు దక్కిన విశేష ఆదరణకు ముగ్దులయ్యారు. ప్రయాణీకుల్లో 50 మందిని ఎంపిక చేసి, వారికి లగ్జరీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని ప్రత్యేక ఆఫర్ కింద అందించారు. ఇండియా, పాకిస్తాన్ తమకు అత్యంత విలువైన ట్రావెల్ మార్కెట్స్ అనీ, ఆయా దేశాల పట్ల తమకు ప్రత్యేకమైన గౌరవం వుందని ఈ కారణంగానే తాము ప్రత్యేక ఏర్పాట్లు ఆయా దేశాల స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేశామని యాక్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్ మజీద్ అల్ ఖూరి చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







