అబుదాబీలో ఇండియా, పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవాల సెలబ్రేషన్స్
- August 15, 2017
ఆగస్ట్ 14న పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం కావడం, ఆగస్ట్ 15వ తేదీ భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అధికారులు, ఆయా దేశాల నుంచి వచ్చినవారికి ప్రత్యేకంగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ పలు కార్యక్రమాలు చేపట్టారు. ఫ్లాష్ మాబ్స్, ఆయా దేశాల పతాకాలతో కూడిన బెలూన్స్ని ఎగరవేయడం వంటివి ఎయిర్పోర్ట్లో ఏర్పాటు చేశారు. దీంతో ఇరు దేశాలకు చెందినవారూ అబుదాబీ విమానాశ్రయంలో తమకు దక్కిన విశేష ఆదరణకు ముగ్దులయ్యారు. ప్రయాణీకుల్లో 50 మందిని ఎంపిక చేసి, వారికి లగ్జరీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని ప్రత్యేక ఆఫర్ కింద అందించారు. ఇండియా, పాకిస్తాన్ తమకు అత్యంత విలువైన ట్రావెల్ మార్కెట్స్ అనీ, ఆయా దేశాల పట్ల తమకు ప్రత్యేకమైన గౌరవం వుందని ఈ కారణంగానే తాము ప్రత్యేక ఏర్పాట్లు ఆయా దేశాల స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేశామని యాక్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్ మజీద్ అల్ ఖూరి చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









