వేసవి పని నిషేధాన్ని ఉల్లంఘించిన 80 సంస్థలు

- August 17, 2017 , by Maagulf
వేసవి పని నిషేధాన్ని ఉల్లంఘించిన 80 సంస్థలు

మనామా: రాజ్యంలోని మొత్తం 80 సంస్థలు వేసవి కాలపు పని నిషేధాన్ని రద్దు చేశాయి. జూలై 1 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలను పట్టించుకోని సంస్థలకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మంత్రిత్వశాఖలో కార్మిక  వ్యవహారాల కార్యదర్శి  సబాహ్ అల్ దోస్సారిలో చెప్పారు. వేసవికాలంలో మధ్యాహ్న పని నిషేధిత సమయంలో కార్మికులతో  పని చేయిస్తున్న  80 సంస్థలకు చెందిన 155 మంది కార్మికులను కనుగొన్నారు. మండే ఎండలలో కార్మికుల  రెండు నెలల పాటు నిషేధం అమలులో ఉందని ఆ సమయంలో కార్మికులు ఎవరూ ప్రత్యక్షంగా సూర్యకాంతిలో ఉండరాదని నిబంధన ఉందని మధ్యాహ్నాం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు శ్రమతో కూడిన పనిని నిషేధించాయి. ఇది 2007 నుండి విధించిన నిషేధం, ఉష్ణోగ్రతలు 40-డిగ్రీ సెల్సియస్ పెరిగినపుడు వడదెబ్బ తగలడం మరియు తీవ్రమైన వేడి గాల్పుల కారణంగా ఏర్పడిన అనారోగ్యం నుండి కార్మికులను కాపాడేందుకు ఉద్దేశించబడ్డాయి. దేశంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా 46 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటాయి.ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన సంస్థలు నిషేధ గంటలలో పనిచేసే ప్రతి కార్మికులకు 500 బెహెరిన్ దినార్ల నుండి 1,000 బెహెరిన్ దినార్ల వరకు జరిమానా చెల్లించాల్సిన అవసరం ఉంది. వేసవికాలంలో గరిష్టంగా 5 గంటలు పనిచేయడానికి మాత్రమే కార్మికులు అనుమతించబడ్డారు. ఉల్లంఘనలకు పాల్పడిన 80 సంస్థల నుండి కనీసం 77,500 బెహెరిన్ దినార్లను జరిమానాను మంత్రిత్వ శాఖ సేకరిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com