జీతాల కోసం కన్స్ట్రక్షన్ కంపెనీ కార్మికుల ఆందోళన
- August 18, 2017
మనామా: ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన 50 మందికి పైగా కార్మికులు అండలుస్ గార్డెన్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్ వేతనాల్ని చెల్లించాల్సిందిగా వారంతా డిమాండ్ చేశారు. కంపెనీలో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారనీ, గత ఏడాది నవంబర్ నుంచి జీతాలు చెల్లించడంలేదని ఆరోపిస్తున్నారు ఆందోళన చేసిన కార్మికులు. వారిలో ఒక కార్మికుడు జగన్ మాట్లాడుతూ, బకాయిల్ని చెల్లించేసినట్లుగా మినిస్ట్రీకి కంపెనీ తప్పుడు సమాచారం ఇచ్చిందని అన్నారు. కొంతమందికి మాత్రమే వేతనాలు చెల్లించాలనీ, 30 మంది బహ్రెయినీ ఉద్యోగులకు మాత్రమే చెల్లింపులు జరిగాయనీ, వలసదారులమైన తామెవరికీ జీతాలు, బకాయిలూ కంపెనీ చెల్లించలేదని ఆయన ఆరోపించడం జరిగింది. కంపెనీకి పెద్ద కాంట్రాక్టులు రావడంతో 2016లో కార్మికుల్ని నియమించుకుంది. సప్లయర్స్ నుంచి పేమెంట్స్ లేకపోవడం, ప్రాజెక్టుల డిలే కావడంతో కంపెనీ నష్టాలపాలయ్యింది. కంపెనీ స్పందించకపోవడంతో తమ భవిష్యత్తు అంధకారమైపోయిందని జగన్ వాపోయారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









