ముగ్గురి తలలు నరికేసిన అల్ షబాబ్ ఉగ్రవాదులు
- August 18, 2017
లండన్ : కెన్యా ఉత్తర తీరప్రాంతంలోని లామూ కౌంటీలో ఇస్లాం ఉగ్రవాదులు శుక్రవారంనాడు ముగ్గురు పౌరులను అత్యంత కిరాతకంగా తలలు నరికి చంపారు. ఇళ్లు తగులబెట్టారు. విటూ పట్టణం సమీపంలోని మలేలి గ్రామంలో జరిగిన ఈ పాశవిక దాడి అల్ షబాబ్ ఉగ్రవాదాల పనిగా అనుమానిస్తున్నట్టు లామూ కౌంటీ కమిషనర్ గిల్బర్ కితియో తెలిపారు. ఇదే గ్రామంలో మూడు ఇళ్లకు కూడా ఉగ్రవాదులు నిప్పుపెట్టినట్టు తీరప్రాంత పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గురువారం అర్థరాతి సాయుధులు స్థానికులపై విరుచుపడ్డారని, వారిని ఇళ్లలోంచి బైటకు లాక్కొచ్చి పాశవికంగా నరికి చంపారని ఆయన చెప్పారు. గత కొన్నేళ్లుగా అల్ షబాబ్ మిలిటెంట్లు పలు మార్లు పాశవిక దాడులు జరిపినప్పటికీ తలలు నరకిచంపిన ఘటనలు మాత్రేం అరుదే. అల్ షబాబ్ ఉగ్రసంస్థ గత జూలైలోనూ లామూ కౌంటీలోని మరో గ్రామంపై దాడులు జరిపి తొమ్మిది మందిని తలలు నరికి చంపింది. అల్ఖైదా ఉగ్రసంస్థతో సంబంధాలున్న అల్ షబాబ్ కెన్యా దళాలపై ప్రతీకారం తీర్చుకుంటామని గతంలో పలుమార్లు ప్రకటించింది. అల్ షబాబ్ ఉగ్రవాదులపై పోరాటానికి 2011లో సోమాలియా సరిహద్దుల్లోకి కెన్యా బలగాలను పంపడంపై అల్ షబాబ్ గుర్రుమంటోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









