ముగ్గురి తలలు నరికేసిన అల్ షబాబ్ ఉగ్రవాదులు
- August 18, 2017లండన్ : కెన్యా ఉత్తర తీరప్రాంతంలోని లామూ కౌంటీలో ఇస్లాం ఉగ్రవాదులు శుక్రవారంనాడు ముగ్గురు పౌరులను అత్యంత కిరాతకంగా తలలు నరికి చంపారు. ఇళ్లు తగులబెట్టారు. విటూ పట్టణం సమీపంలోని మలేలి గ్రామంలో జరిగిన ఈ పాశవిక దాడి అల్ షబాబ్ ఉగ్రవాదాల పనిగా అనుమానిస్తున్నట్టు లామూ కౌంటీ కమిషనర్ గిల్బర్ కితియో తెలిపారు. ఇదే గ్రామంలో మూడు ఇళ్లకు కూడా ఉగ్రవాదులు నిప్పుపెట్టినట్టు తీరప్రాంత పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గురువారం అర్థరాతి సాయుధులు స్థానికులపై విరుచుపడ్డారని, వారిని ఇళ్లలోంచి బైటకు లాక్కొచ్చి పాశవికంగా నరికి చంపారని ఆయన చెప్పారు. గత కొన్నేళ్లుగా అల్ షబాబ్ మిలిటెంట్లు పలు మార్లు పాశవిక దాడులు జరిపినప్పటికీ తలలు నరకిచంపిన ఘటనలు మాత్రేం అరుదే. అల్ షబాబ్ ఉగ్రసంస్థ గత జూలైలోనూ లామూ కౌంటీలోని మరో గ్రామంపై దాడులు జరిపి తొమ్మిది మందిని తలలు నరికి చంపింది. అల్ఖైదా ఉగ్రసంస్థతో సంబంధాలున్న అల్ షబాబ్ కెన్యా దళాలపై ప్రతీకారం తీర్చుకుంటామని గతంలో పలుమార్లు ప్రకటించింది. అల్ షబాబ్ ఉగ్రవాదులపై పోరాటానికి 2011లో సోమాలియా సరిహద్దుల్లోకి కెన్యా బలగాలను పంపడంపై అల్ షబాబ్ గుర్రుమంటోంది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..