అమెరికాలో అరుదైన స్థానం సంపాదించిన గుంటూరోడు
- August 19, 2017
అమెరికాలో తెలుగుతేజం మెరిసింది. ప్రతిష్ఠాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా గుంటూరు వాసికి అరుదైన అవకాశం దక్కింది. వర్సిటీలోని వ్యాస్కులర్ సర్జన్ విభాగంలో అమెరికాయేతర వ్యక్తిగా గుంటూరులోని బ్రాడీపేటకు చెందిన కార్తీక్ మిక్కినేని ఎంపికయ్యారు. గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన కార్తీక్ న్యూయార్క్లోని విల్ కార్నెల్ మెడికల్ కళాశాలలో ఏడాది పాటు ఉన్నత విద్యనభ్యసించారు. అనంతరం ఫిట్స్బర్గ్ యూనివర్సిటీలో వ్యాస్కులర్ సర్జరీలో పీజీ పూర్తి చేశారు. ఏడాదికి రూ.2.08 కోట్ల ప్యాకేజీతో మూడేళ్ల పాటు యూనివర్సిటీ ఒప్పందం చేసుకుందని ఈ సందర్భంగా కార్తీక్ 'ఆంధ్రజ్యోతి'కి తెలిపారు. మూడేళ్ల అనంతరం తాను అంగీకరిస్తే ఒప్పందాన్ని పొడిగిస్తారన్నారు. మూడేళ్ల తరువాత నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆస్పత్రి స్థాపించి సేవలు చేయాలని భావిస్తున్నాని అన్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









