సౌదీ మక్కా హోటల్ లో అగ్నిప్రమాదం... ఖాళీ చేసిన హజ్ యాత్రికులు
- August 21, 2017
రియాద్: సౌదీ అరేబియా నగరం మక్కాలోని ఒక హోటల్ లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది.వార్షిక హజ్ యాత్ర కోసం 2 లక్షల మంది ఈ పవిత్ర కార్యక్రమానికి హాజరవ్వగా, అకస్మాత్తుగా ఏర్పడిన అగ్ని ప్రమాదం కారణంగా సోమవారం వారినందరిని అక్కడ నుంచి ఖాళీ చేయించినట్లు సివిల్ రక్షణ ప్రతినిధి నయఫ్ అల్-షరీఫ్ తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఒక్కరికీ ఎటువంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. అజాజియా జిల్లాలో మక్కాలోని ఒక హోటల్ ఎనిమిదవ అంతస్థులో ఎయిర్ కండిషన్ యూనిట్ లో దురదృష్టవశాత్తు మంటలు వెలువడ్డాయి. ఈ హోటల్ లో 600 మంది నివాసితులు, వీరిలో చాలామంది టర్కీ మరియు యెమెన్ నుండి హజ్ తీర్ధయాత్రకు వచ్చారు. మంటలను అదుపు చేసిన తర్వాత వారంతా హోటల్ తిరిగి వచ్చినట్లు షరీఫ్ చెప్పారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







