అత్యంత వేగంగా ప్రయాణించే బులెట్ రైలు చైనాలో ప్రారంభం
- August 21, 2017
ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే బులెట్ రైలును చైనా సెప్టెంబరు 21 నుంచి నడపనుంది. రాజధాని బీజింగ్ నుంచి వాణిజ్య రాజధాని షాంఘైకి (దూరం 1250 కి.మీ.) ఈ రైలు కేవలం నాలుగున్నర గంటల్లో చేరుకోగలదు. ప్రస్తుతం నడుస్తున్న బులెట్ రైళ్లు ఈ దూరానికి ఆరు గంటల సమయం తీసుకుంటున్నాయి. ఫక్సింగ్ పేరుతో ప్రవేశపెడుతున్న అధునాతన బులెట్ రైళ్లు గంటకు 350 కి.మీ. వేగంతో ప్రయాణించగలవు. వాణిజ్య ప్రాతిపదికన ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు ఇదే అవుతుందని చైనా రైల్వే సంస్థ తెలిపింది. మొట్టమొదటి అధికవేగ రైలును 350 కి.మీ. వేగంతో బీజింగ్ నుంచి తియాంజిన్కు 2008 ఆగస్టులో చైనా నడిపింది. ఆ తర్వాత మరో మూడు అధికవేగ మార్గాలను తెరిచింది. 2011 జులైలో రెండు బులెట్ రైళ్లు ఒకదానినొకటి ఢీకొని 40 మంది చనిపోయిన తర్వాత వీటి వేగాన్ని 250-300 కి.మీ.కి తగ్గించింది. కొత్తగా ఫక్సింగ్ రైళ్లను జూన్లో సిద్ధం చేసింది. ఇవి గరిష్ఠంగా గంటకు 400 కి.మీ. దూరం ప్రయాణించగలవు. వీటి భద్రత, విశ్వసనీయతపై గత నెలలోనే పరీక్షలన్నీ పూర్తయ్యాయి.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







