అత్యంత వేగంగా ప్రయాణించే బులెట్ రైలు చైనాలో ప్రారంభం
- August 21, 2017
ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే బులెట్ రైలును చైనా సెప్టెంబరు 21 నుంచి నడపనుంది. రాజధాని బీజింగ్ నుంచి వాణిజ్య రాజధాని షాంఘైకి (దూరం 1250 కి.మీ.) ఈ రైలు కేవలం నాలుగున్నర గంటల్లో చేరుకోగలదు. ప్రస్తుతం నడుస్తున్న బులెట్ రైళ్లు ఈ దూరానికి ఆరు గంటల సమయం తీసుకుంటున్నాయి. ఫక్సింగ్ పేరుతో ప్రవేశపెడుతున్న అధునాతన బులెట్ రైళ్లు గంటకు 350 కి.మీ. వేగంతో ప్రయాణించగలవు. వాణిజ్య ప్రాతిపదికన ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు ఇదే అవుతుందని చైనా రైల్వే సంస్థ తెలిపింది. మొట్టమొదటి అధికవేగ రైలును 350 కి.మీ. వేగంతో బీజింగ్ నుంచి తియాంజిన్కు 2008 ఆగస్టులో చైనా నడిపింది. ఆ తర్వాత మరో మూడు అధికవేగ మార్గాలను తెరిచింది. 2011 జులైలో రెండు బులెట్ రైళ్లు ఒకదానినొకటి ఢీకొని 40 మంది చనిపోయిన తర్వాత వీటి వేగాన్ని 250-300 కి.మీ.కి తగ్గించింది. కొత్తగా ఫక్సింగ్ రైళ్లను జూన్లో సిద్ధం చేసింది. ఇవి గరిష్ఠంగా గంటకు 400 కి.మీ. దూరం ప్రయాణించగలవు. వీటి భద్రత, విశ్వసనీయతపై గత నెలలోనే పరీక్షలన్నీ పూర్తయ్యాయి.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









