జైల్లో కారిడార్ను సొంత ఇంటిలావాడుకుంటున్న శశికళ
- August 21, 2017
పరప్పణ అగ్రహార జైలులో శిక్షననుభవిస్తున్న ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ జైలులో సుమారు 120 నుంచి 150 అడుగల పొడవున్న కారిడార్ను ఇరువైపులా బారికేడ్లు పెట్టి ప్రైవేటు స్థలంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ మాజీ డిఐజి డి రూప ఎసిబికి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఈ కారిడార్లో ఉన్న ఐదు గదులు శశికళ ఉపయోగించుకుంటున్నారని, ఆమె వ్యక్తిగత సామగ్రి వాటిలో ఉందని రూప పేర్కొన్నారు. దుస్తులు, బెడ్డింగ్, వంటపాత్రలు, వాటర్ ఫిల్టర్, ఎలెక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్, ఒక టేబుల్ ఈ గదుల్లో ఉన్నాయని ఎసిబి ఐజిపికి ఇచ్చిన లేఖలో రూప పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు లేకుండా అనధికారికంగా ప్రత్యేక సదుపాయాలు కల్పించడం కోర్టు ధిక్కారమవుతుందని, అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లవుతుందని రూప పేర్కొన్నారు. జైలుకు వచ్చిన సందర్శకులను కలవడానికి శశికళ ప్రత్యేకంగా సదుపాయాలు కలిగిన మీటింగ్ రూమ్ను ఉపయోగించుకుంటున్నారని, దీనిలో చుట్టూ పరదాలు ఉండి లోపల ఏం జరుగుతున్నదో తెలిసే అవకాశం లేదని రూప తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలను 6, 7 నెంబర్ల సిసిటివి కెమేరాలలో చూడవచ్చునని రూప అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







