వీసా గడువు ముగిసినా లండన్లో 200మంది భారతీయుల అరెస్టు
- August 22, 2017
వీసా గడువు ముగిసినా లండన్లో ఉన్న భారతీయుల్ని అరెస్టు చేసినట్లు ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. భారత్ నుంచి ఏటా సుమారు వెయ్యి మంది ఎలాంటి వీసా లేకుండా లండన్లో ప్రవేశిస్తున్నారంటూ అధికారులు తెలిపారు.
ఈ ఏడాది జనవరి-జూన్ మధ్య వీసా గడుపు పూర్తి అయినా తిరిగి స్వదేశానికి వెళ్లకుండా అక్కడే కొనసాగుతన్న సుమారు 200మంది భారతీయుల్ని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. భారత్తో పాటు పాకిస్థాన్, అప్గనిస్థాన్, చైనా, ఆల్బానియా చెందిన పలువుర్ని అదుపులోకి తీసుకున్నట్లు వారు చెప్పారు. వీరిందరి వద్ద ఉన్న పాస్పోర్టులను తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు వారికి జరిమానా విధించారు. వెస్ట్ లండన్లోని సౌత్ఆల్ ఏరియాలో సుమారు ఏడుగురు భారతీయులను అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు సమాచారం. గడువు ముగిసినా ఇక్కడే ఉండి డబ్బులు సంపాదించుకుని..
ట్యాక్స్ కట్టడంలేదని వారు తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి యువతను ఆకర్షిస్తోన్న ఏజెన్సీలపై నిఘా పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







