జైహింద్ నినాదం చేసిన కెనడా ప్రధానమంత్రి
- August 22, 2017
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. క్యూబెక్లో జరిగిన ఇండియా డే పరేడ్లో ఆయన పాల్గొన్నారు. పర్పుల్ కలర్ కుర్తా పైజామా ధరించి భారతదేశ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాదు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగం పూర్తి చేసిన తర్వాత 'జై హింద్' అని నినందించి అక్కడికి వచ్చిన వారందరి మనసులను గెలుచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విటర్ ద్వారా పోస్టు చేశారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధం కొనసాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ పరేడ్లో కెనడాలోని భారత హైకమిషనర్ రాయబారి వికాస్ స్వరూప్ కూడా పాల్గొన్నారు.
కెనడా ప్రధానమంత్రి ఇండియా పరేడ్లో పాల్గొనడం పట్ల వికాస్ స్వరూప్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నెటిజన్లు ట్రూడోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భారతీయ సంప్రదాయాన్ని గౌరవించడం చాలా గర్వంగా ఉందంటూ ట్వీట్లు చేస్తున్నారు. జులై నెలలో టొరంటోలోని శ్రీస్వామినారాయణ ఆలయానికి వెళ్లిన సమయంలో కూడా ట్రూడో కుర్తా పైజామాలో వచ్చారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







