దక్షిణాఫ్రికా లోని మనుషుల్ని తిని అలసిపోయిన నరమాంస భక్షకుడు
- August 23, 2017మనిషి ని మనిషి చంపుకొని తినే స్థాయి నుంచి మానవుడు నాగరికత నేర్చాడు.. కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల నర మాంస భక్షకులు ఉన్నారనే వార్తలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి.. తాజాగా ఓ నరమాంస భక్షకుడు తాను మనుషుల్ని తిని తిని అలసిపోయాను.. ఇక మనుషులను తినలేను అని పోలీస్ స్టేషన్ లో లొంగి పోయాడు. తాను లొంగిపోతూ.. పోలీసులకు ఓ మనిషి కాలు, చేతిని కూడా అప్పగించి వారికి షాక్ ఇచ్చాడు.. వివరాల్లోకి వెళ్తే..
దక్షిణాఫ్రికా లోని అమాంగ్వే ప్రాంతంలో గత కొంత కాలంగా పలువురు కనిపించకుండా పోతున్నారు. దీంతో చాలా మంది తమ వాళ్ళు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపద్యంలో పోలీసులు విచారణ చేపట్టగా ఓ ప్లేస్ లో కుండ దానినిండా మానవ అవయవాలు లభ్యమయ్యాయి. అంతేకాదు.. ఇటీవల ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు కలిసి దారుణంగా చంపేసి.. ఆమె మృత దేహాన్ని ముక్కలుగా నరికేశారు. ఆపై.. ఆమె మృతదేహంలోని అవయవాలను ఆ ముగ్గురు వ్యక్తులు తినేశారు.. ఈ విషయం పోలీసుల పరిశోధనలో వెలుగులోకి వచ్చింది.. కాగా ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు తాను మనుషులను తిని అలసిపోయాను అని స్వయంగా పోలీసులకు లొంగిపోవడం తో అతనిని అదుపులోకి తీసుకొన్నారు.. మిగిన ఇద్దరు నర మాంస భక్షకుల కోసం వెదుకుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..