పుంజుకున్న సైనా నెహ్వాల్ ..!

- August 23, 2017 , by Maagulf
పుంజుకున్న సైనా నెహ్వాల్ ..!

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు దూసుకెళుతున్నారు. ఇప్పటికే శ్రీకాంత్, సింధు, అజయ్ జయరామ్ ముందంజ వేయగా... తాజాగా స్టార్ ప్లేయర్ సైనానెహ్వాల్ ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రెండో రౌండ్‌లో సైనా 21-11,21-12 స్కోర్‌తో స్విట్జర్లాండ్ ప్లేయర్ సబ్రీనాపై సునాయాసంగా గెలిచింది. అలాగే పురుషుల సింగిల్స్‌లో తెలుగుతేజం సాయిప్రణీత్ కూడా ప్రీక్వార్టర్స్‌ చేరుకున్నాడు. రెండో రౌండ్‌లో సాయిప్రణీత్ 14-21,21-18,21-19 స్కోర్‌తో ఇండోనేషియా ప్లేయర్ ఆంటోనీపై విజయం సాధించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com