గత వారం జరిగిన కాల్పుల్లో బార్సిలోనాలో తీవ్రవాదులకు జైలు
- August 23, 2017
గత వారం జరిగిన బార్సిలోనా తీవ్రవాద దాడి అనంతరం నిర్బంధంలోకి తీసుకున్న నలుగురిలో ఇద్దరికి ఏకాంత కారాగార వాస శిక్ష విధిస్తూ నేషనల్ కోర్టు (ఎఎన్) న్యాయమూర్తి ఫెర్నాండో ఆండ్రూ తీర్పు చెప్పారు. శిక్ష కాలంలో వారికి బెయిల్ కూడా లభించదు. గత గురువారం బార్సిలోనా, కాంబ్రిల్స్ల్లో జరిగిన దాడుల్లో 15మంది మరణించగా, వందమందికి పైగా గాయపడ్డారు. ఆ దాడులకు పాల్పడిన జిహాదీస్ట్ సెల్ సభ్యులుగా భావిస్తున్న మహ్మద్ హులీ చెమ్లాల్, డ్రిస్ ఒకబిర్లకు న్యాయమూర్తి శిక్ష విధించారు. తీవ్రవాద సంస్థలో చేరడం, హత్యలు వంటి అభియోగాలను వారిపై మోపారు. రిపోల్ పట్టణంలో చిన్న టెలిఫోన్ కాల్ సెంటర్ నడుపుతున్న సాలాV్ా ఎల్ కరీబ్కు ఈ దాడుల్లో గల పాత్రపై నిర్ధారణకు వచ్చేవరకు శిక్ష విధించే విషయమై 72గంటల పాటు న్యాయమూర్తి తన నిర్ణయాన్ని నిలుపు చేశారు. చివరకు అతనిని వదిలిపెట్టారు. కరీబ్పై చర్యలు తీసుకోవడానికి తగిన సాక్ష్యాధారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









