బ్రిటన్లో నాలుగు శాతం తగ్గిన భారతీయ వీసాలు
- August 24, 2017బ్రిటన్లో నైపుణ్య ఉద్యోగవీసాల కోసం భారతీయుల దరఖాస్తుల సంఖ్య నాలుగు శాతం పడిపోయిందని అక్కడి హోం కార్యాలయం పేర్కొంది. 2017 జూన్ ముగిసే నాటికి 29,800 భారతీయులు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. వలసల నియంత్రణ కోసం వీసాల జారీలో బ్రిటన్ ప్రభుత్వం నిబంధనలను కఠినంగా మార్చిన విషయం తెలిసిందే. 5,686 దరఖాస్తులతో అమెరికా భారత్ తర్వాతి స్థానంలో నిలిచిందని వెల్లడించింది. ఈ వీసాల సహాయంతో విదేశీయులు అక్కడే నివసిస్తూ ఉద్యోగం చేసుకోవచ్చు.
బ్రిటన్లోని జాతీయ గణాంకాల వివరాల ప్రకారం బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటివరకు జారీ చేసిన మొత్తం 92,805 ఉద్యోగ వీసాల్లో 53,366 వీసాలు భారతీయులకే మంజూరు చేసింది. అందులో 42 శాతం వీసాలు ఐటీ రంగంలోనే అందించారు.
తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం బ్రెక్సిట్ తరవాత ఐరోపా దేశాల నుంచి బ్రిటన్కు వలసలు తగ్గుముఖం పట్టాయని తెలుస్తోంది. మరోవైపు వీసా దరఖాస్తుల పతనంతో ఉద్యోగాలకు సరైన వ్యక్తులను ఎంపిక చేయడానికి స్థానిక సంస్థలకు కష్టంగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం