ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో చరిత్ర సృష్టించిన సైనా, సింధు
- August 25, 2017
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు చరిత్ర సృష్టించారు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్లలో వీరిద్దరూ విజయం సాధించి సెమీస్లోకి దూసుకెళ్లారు. ఈ విజయాలతో వీరిద్దరూ పతకాలను ఖాయం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో అద్భుత విజయం సాధించిన సింధు సెమీస్లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో చైనా షట్లర్ సన్ యూపై ఆధిపత్యం ప్రదర్శించి 21-14, 21-9 తేడాతో విజయం సాధించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడి ప్రత్యర్థి పుంజుకునేందుకు అవకాశం ఇవ్వకుండా చెలరేగిన సింధు ముందు సన్యూ నిలవలేకపోయింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో ఇది ఆమెకు మూడో పతకం కానుండటం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్ కూడా సింధునే. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం సింధు నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
ఇక క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్.. స్కాట్లాండ్ క్రీడాకారిణి గిల్మార్పై 21-19, 18-21, 21-15 తేడాతో విజయం సాధించి సెమీస్లోకి అడుగుపెట్టింది.
శనివారం జరిగే సెమీస్ల్లో సైనా, సింధు విజయం సాధిస్తే.. ఆదివారం జరిగే ఫైనల్లో వీరిద్దరూ తలపడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







