ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో చరిత్ర సృష్టించిన సైనా, సింధు
- August 25, 2017
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు చరిత్ర సృష్టించారు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్లలో వీరిద్దరూ విజయం సాధించి సెమీస్లోకి దూసుకెళ్లారు. ఈ విజయాలతో వీరిద్దరూ పతకాలను ఖాయం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో అద్భుత విజయం సాధించిన సింధు సెమీస్లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో చైనా షట్లర్ సన్ యూపై ఆధిపత్యం ప్రదర్శించి 21-14, 21-9 తేడాతో విజయం సాధించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడి ప్రత్యర్థి పుంజుకునేందుకు అవకాశం ఇవ్వకుండా చెలరేగిన సింధు ముందు సన్యూ నిలవలేకపోయింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో ఇది ఆమెకు మూడో పతకం కానుండటం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్ కూడా సింధునే. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం సింధు నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
ఇక క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్.. స్కాట్లాండ్ క్రీడాకారిణి గిల్మార్పై 21-19, 18-21, 21-15 తేడాతో విజయం సాధించి సెమీస్లోకి అడుగుపెట్టింది.
శనివారం జరిగే సెమీస్ల్లో సైనా, సింధు విజయం సాధిస్తే.. ఆదివారం జరిగే ఫైనల్లో వీరిద్దరూ తలపడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









