హైదరాబాద్లో 200 వాటర్ ఏటీఎంలు
- August 26, 2017
మేయర్ బొంతు రామ్మోహన్హైదరాబాద్: ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్ నగరంలో 200 వాటర్ ఏటీఎంలు ఏర్పాటు చేస్తామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. ఎన్టీఆర్ గార్డెన్ వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎంను జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్తో కలిసి ఆయన ప్రారంభించారు. వాటర్ ఏటీఎంను స్వీడన్ జోషెఫ్, నేచర్స్ స్ప్రింగ్ సంస్థలు ఏర్పాటు చేశాయి. జీహెచ్ఎంసీ, జలమండలి సహకారంతో ఇవి నడవనున్నాయి. ఈ ఏటీఎం ద్వారా రూ.1కి గ్లాసు, రూ.2కి లీటరు నీళ్లు, రూ.5కి 10 లీటర్లు, రూ.10కి 20 లీటర్ల నీళ్లు అందించనున్నారు. వాటర్ ఏటీఎం ఏర్పాటు సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర ప్రజలకు కాలుష్య రహిత మంచినీరు అందిస్తామని, అందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలన్నదే లక్ష్యం అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







