ఐడియాకు జరిమానా ట్రాయ్ ఆదేశాలు

- August 26, 2017 , by Maagulf
ఐడియాకు జరిమానా ట్రాయ్ ఆదేశాలు

వినియోగదారుల దగ్గర నుంచి అత్యధిక ఛార్జీలు వసూలు చేసినందుకు గాను ఐడియా సెల్యులర్‌కు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) జరిమానా విధించింది. రూ.2.97కోట్లు చెల్లించాల్సిందిగా ట్రాయ్‌ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ్‌బంగ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఐడియా వినియోగదారుల నుంచి అత్యధిక ఛార్జీలు వసూలు చేసినందుకు గాను ఈ జరిమానా విధించింది. మే 2005 నుంచి 2007 జనవరి మధ్యలో ఐడియా వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌కు కాల్స్‌ చేసినపుడు ఈ అధిక ఛార్జీలు వసూలు చేశారు.
టెలికం కన్జ్యూమర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌(టీసీఈపీఎఫ్‌)కు 15 రోజుల్లో ఐడియా రూ.2,97,90,173 జరిమానాను కట్టాల్సిందిగా శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఒకే రాష్ట్రంలో ఒక సర్వీస్‌ నుంచి మరో సర్వీస్‌కు ఫోన్లు చేసుకున్న సమయంలో వేర్వేరు ఛార్జీలను ఐడియా వసూలు చేసినట్లు ట్రాయ్‌ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com