ఐడియాకు జరిమానా ట్రాయ్ ఆదేశాలు
- August 26, 2017
వినియోగదారుల దగ్గర నుంచి అత్యధిక ఛార్జీలు వసూలు చేసినందుకు గాను ఐడియా సెల్యులర్కు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) జరిమానా విధించింది. రూ.2.97కోట్లు చెల్లించాల్సిందిగా ట్రాయ్ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ్బంగ, ఉత్తర్ప్రదేశ్లోని ఐడియా వినియోగదారుల నుంచి అత్యధిక ఛార్జీలు వసూలు చేసినందుకు గాను ఈ జరిమానా విధించింది. మే 2005 నుంచి 2007 జనవరి మధ్యలో ఐడియా వినియోగదారులు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నెట్వర్క్కు కాల్స్ చేసినపుడు ఈ అధిక ఛార్జీలు వసూలు చేశారు.
టెలికం కన్జ్యూమర్స్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్(టీసీఈపీఎఫ్)కు 15 రోజుల్లో ఐడియా రూ.2,97,90,173 జరిమానాను కట్టాల్సిందిగా శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఒకే రాష్ట్రంలో ఒక సర్వీస్ నుంచి మరో సర్వీస్కు ఫోన్లు చేసుకున్న సమయంలో వేర్వేరు ఛార్జీలను ఐడియా వసూలు చేసినట్లు ట్రాయ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







