ఐడియాకు జరిమానా ట్రాయ్ ఆదేశాలు
- August 26, 2017
వినియోగదారుల దగ్గర నుంచి అత్యధిక ఛార్జీలు వసూలు చేసినందుకు గాను ఐడియా సెల్యులర్కు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) జరిమానా విధించింది. రూ.2.97కోట్లు చెల్లించాల్సిందిగా ట్రాయ్ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ్బంగ, ఉత్తర్ప్రదేశ్లోని ఐడియా వినియోగదారుల నుంచి అత్యధిక ఛార్జీలు వసూలు చేసినందుకు గాను ఈ జరిమానా విధించింది. మే 2005 నుంచి 2007 జనవరి మధ్యలో ఐడియా వినియోగదారులు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నెట్వర్క్కు కాల్స్ చేసినపుడు ఈ అధిక ఛార్జీలు వసూలు చేశారు.
టెలికం కన్జ్యూమర్స్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్(టీసీఈపీఎఫ్)కు 15 రోజుల్లో ఐడియా రూ.2,97,90,173 జరిమానాను కట్టాల్సిందిగా శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఒకే రాష్ట్రంలో ఒక సర్వీస్ నుంచి మరో సర్వీస్కు ఫోన్లు చేసుకున్న సమయంలో వేర్వేరు ఛార్జీలను ఐడియా వసూలు చేసినట్లు ట్రాయ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణికులకు అన
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!









