టాప్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్న కళ్యాణ్ రామ్
- August 26, 2017
నందమూరి కళ్యాణ్ రామ్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ని సెలక్ట్ చేసుకునే ఈ హీరోకి పటాస్ తర్వాత హిట్ లేదు. దీంతో ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని మరి, రెండు సినిమాలు స్టార్ట్ చేశాడు.
కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రాల్లో ఎమ్.ఎల్.ఎ ఒకటి. ఉపేంద్ర మాధవ్ అనే కొత్త దర్శకుడు ఈ మూవీతో పరిచయం అవుతున్నాడు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కళ్యాణ్ రామ్ కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలో క్యూరియాసిటీ ఏర్పడింది.
ఎమ్.ఎల్.ఎ చిత్రంతో పాటే మరో సినిమాని పట్టాలెక్కించాడు కళ్యాణ్ రామ్. తమిళ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ జయేంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. టాప్ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి వర్క్ చేస్తుండటం విశేషం. ఇందులో హీరోయిన్ గా మలయాళంలో రెండు సినిమాలు చేసిన ఐశ్వర్య లక్ష్మిని సెలక్ట్ చేశారు.
అయితే ఐశ్వర్యలక్ష్మి క్యారెక్టర్ కు తగ్గ పెర్ఫార్మెన్ చేయలేకపోతుందనే కారణంతో, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి స్టార్ హీరోయిన్ తమన్నాని తీసుకున్నారు. తమన్నా యాడ్ అవ్వడంతో ఈ సినిమాకి కూడా కాస్త హైప్ వచ్చింది. కెరీర్లో ఎక్కువగా కొత్త వాళ్ళతోనే సినిమాలు చేసిన కళ్యాణ్ రామ్, ఈ సారి కాజల్, తమన్నాలతో రొమాన్స్ చేయబోతున్నాడు. వీళ్ళిద్దరూ ఈ రెండు సినిమాలకు ఎంత ప్లస్ అవుతారో చూడాలి.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







