ఫైనల్స్ కి దూసుకెళ్లిన సింధు
- August 26, 2017
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో సంచలనం సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోవ్లో జరుగుతున్న పోటీల్లో శనివారం రాత్రి జరిగిన రెండో సెమీస్లో చైనాకు చెందిన జూనియర్ ఛాంపియన్ చెన్ యుఫీపై 21-13, 21-10 తేడాతో సింధు ఘన విజయం సాధించారు.
కేవలం 48 నిమిషాల్లోనే సింధు మ్యాచ్ని ముగించటం విశేషం. ఇక ఆదివారం సాయంత్రం జరిగే ఫైనల్లో జపాన్కు చెందిన ఒకుహరా తో స్వర్ణం కోసం సింధు ఢీకొట్టబోతుంది. ఒకుహరా మన దేశానికే చెందిన సైనానెహ్వాల్ను తొలి సెమీస్లోని ఓడించి ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. దీంతో సైనా కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక ప్రపంచ ఛాంపియన్ షిప్లో పీవీ సింధు ఇప్పటివరకు రెండుసార్లు(2013, 2014) కాంస్య పతకాలు సాధించారు. ఈసారి భారత్కు బంగారు పతకం సాధించిపెట్టాలన్న ధీమాతో పోరాడేందుకు సిద్ధమైపోతున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









