ఫైనల్స్ కి దూసుకెళ్లిన సింధు
- August 26, 2017
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో సంచలనం సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోవ్లో జరుగుతున్న పోటీల్లో శనివారం రాత్రి జరిగిన రెండో సెమీస్లో చైనాకు చెందిన జూనియర్ ఛాంపియన్ చెన్ యుఫీపై 21-13, 21-10 తేడాతో సింధు ఘన విజయం సాధించారు.
కేవలం 48 నిమిషాల్లోనే సింధు మ్యాచ్ని ముగించటం విశేషం. ఇక ఆదివారం సాయంత్రం జరిగే ఫైనల్లో జపాన్కు చెందిన ఒకుహరా తో స్వర్ణం కోసం సింధు ఢీకొట్టబోతుంది. ఒకుహరా మన దేశానికే చెందిన సైనానెహ్వాల్ను తొలి సెమీస్లోని ఓడించి ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. దీంతో సైనా కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక ప్రపంచ ఛాంపియన్ షిప్లో పీవీ సింధు ఇప్పటివరకు రెండుసార్లు(2013, 2014) కాంస్య పతకాలు సాధించారు. ఈసారి భారత్కు బంగారు పతకం సాధించిపెట్టాలన్న ధీమాతో పోరాడేందుకు సిద్ధమైపోతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







