జమ్ముకశ్మీర్‌లో మరోసారి రక్తపాతం

- August 26, 2017 , by Maagulf
జమ్ముకశ్మీర్‌లో మరోసారి రక్తపాతం

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉగ్రవాదులు పోలీస్‌ భవన సముదాయంలోకి చొరబడి దాడి చేశారు. కాల్పులు జరుపుతూ... గ్రనేడ్లు విసిరారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 8మంది జవాన్లు మృతిచెందారు. భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లా పోలీస్‌ లైన్స్‌ బిల్డింగ్‌లో దాక్కున్న మరో ఉగ్రవాది కోసం ఆపరేషన్‌ కొనసాగుతోంది. పోలీస్‌ లైన్లో ఉన్న వారి కుటుంబాలను సురక్షితంగా బయటకు పంపినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com