హైదరాబాద్‌లో వాటర్‌ ఏటీఎంలు ప్రారంభించిన హైదరాబాద్ మేయర్

- August 26, 2017 , by Maagulf
హైదరాబాద్‌లో వాటర్‌ ఏటీఎంలు ప్రారంభించిన హైదరాబాద్ మేయర్

హైదరాబాద్‌లో శుక్రవారం నాలుగు చోట్ల 24 గంటల పాటు మంచినీటిని ఒక రూపాయి, 2 రూపాయలతో తీసుకొనే వాటర్‌ ఏటీఎంలు ప్రారంభమయ్యాయి. జోసబ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, నేచర్స్‌ స్ర్పింగ్‌ ఎకో ట్యాప్‌ల సంయుక్త ఆధ్వర్యంలో స్వీడన్‌ టెక్నాలజీ ద్వారా జీహెచ్‌ఎంసీ, జలమండలిల సహకారంతో ఈ వాటర్‌ ఏటీఎంలు పని చేస్తాయి. ప్రతి రోజు వందలాది మంది పర్యటించే ఎన్టీఆర్‌ మార్గంలో మొట్టమొదటి వాటర్‌ ఏటీఎంను గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జనార్దన్‌రెడ్డి, కార్పొరేటర్‌ విజయారెడ్డి ప్రారంభించి కాయిన్‌ ద్వారా మంచినీటిని పొంది పరిశీలించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com