ఆధార్ వ్యవస్థ సురక్షితమే
- August 27, 2017
న్యూదిల్లీ: ఆధార్ వ్యవస్థ సురక్షితంగా ఉందని.. ఎటువంటి లీకులకు అవకాశం లేదని ది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథార్టీ ఆఫ్ ఇండియా భరోసానిచ్చింది. ఇటీవల కొన్ని విదేశీ సంస్థల చేతిలోకి ఆధార్ సమాచారం వెళ్లిందని వస్తున్న వార్తలను యూఐడీఏఐ కొట్టిపారేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధార్కు సంబంధించిన బయోమెట్రిక్ సాంకేతికత దేశీయంగా అభివృద్ధి చేసిందని పేర్కొంది. స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది ఇటువంటి తప్పుడు ప్రచారాలను చేపడుతున్నారని తెలిపారు. ఆధార్ కోసం వినియోగించే ప్రతి యంత్రాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాతే బయోమెట్రిక్ సమాచారం సేకరించడానికి వినియోగిస్తామని అన్నారు.
ఆధార్ డేటాబేస్లోకి అమెరికా నిఘాసంస్థ సీఐఏ చొరబడిందని వికీలీక్స్ పేర్కొనడంతో కలకలం రేగింది. దీంతో యూఐడీఏఐ స్పందించి వివరణ ఇచ్చింది.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









