వచ్చే నెల 6, 7, 8 తేదీలలో గోదావరి జలసిరికి హారతి
- August 28, 2017
వచ్చే నెల 6, 7, 8 తేదీలలో జలసిరికి హారతి కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నదులు.. చెరువులతో సహా.. రాష్ట్రంలోని అన్ని జలవనరులను ఆ మూడు రోజులు పూజించుకునేలా.., ఇందులో ప్రజలు భాగస్వామ్యులు అయ్యేలా చూడాలని సూచించారు. పోలవరం సహా 28 ప్రాజెక్టుల పనులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
అమరావతిలో సీఎం చంద్రబాబు పోలవరం సహా 28 ప్రాజెక్టుల పనుల తీరుతెన్నులపై సమగ్రంగా సమీక్షించారు. 38వ సారి పోలవరం పనుల పురోగతిపై వర్చువల్ ఇన్స్పెక్షన్ చేశారు. వర్షాల కారణంగా ఈనెల మొదటి రెండు వారాలు పనులు ఆలస్యమయ్యాయని, అయితే ఎన్నడూ లేనంతగా ఈవారం మాత్రం రికార్డు స్థాయిలో 21 వేల 226 క్యూబిక్ మీటర్ల వరకు స్పిల్వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు జరిగాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అయితే రోజుకు కాంక్రీట్ పనుల సరాసరి 3 వేల 50 క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే చాలవని, 4 వేల నుంచి 5 వేల క్యూబిక్ మీటర్ల వరకు పనుల వేగం పెరగాల్సి వుందని ముఖ్యమంత్రి సూచించారు. అటు.. స్పిల్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్కు సంబంధించి రెండున్నర లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టి తవ్వకం పూర్తయ్యింది. మొత్తం రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్, 15 ఆర్మ్ గ్రైడర్ల ఫ్యాబ్రికేషన్ పూర్తయ్యింది. ఈనెల 24న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశమై ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణం తీరుతెన్నులను సమీక్షించిందని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 15 నాటికి యాగ్రిగేట్ కూలింగ్ ప్లాంట్ సిద్ధమవుతుందని చెప్పారు. అటు.. గిరిజనులకు న్యాయం చేస్తూ, ముంపు ప్రాంతాలలో భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు.
మరోవైపు.. రాష్ట్రంలో నీటికివ్వాల్సిన ప్రాధాన్యతను తెలియజేస్తూ..సీఎం చంద్రబాబు కొత్త కార్యక్రమానికి నాంది పలికారు. వచ్చే నెల 6, 7, 8 తేదీలలో జలసిరికి హారతి కార్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నదుల దగ్గర నుంచి చెరువుల వరకు రాష్ట్రంలోని అన్ని జలవనరులను ఆ మూడు రోజులు పూజించుకునేలా.., ఇందులో ప్రజలు భాగస్వామ్యులు అయ్యేలా చూడాలని సూచించారు.
విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, సెప్టెంబర్లో కాస్త తగ్గుముఖం పడతాయని ఇస్రో అధికారులు సీఎంకు చెప్పారు. భూగర్భ జలాలు సమృద్ధిగా వున్నాయని అధికారులు చెప్పడంతో కొత్తగా బోర్లకు అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









