40 మంది తెలుగు వారికి అబుదాబిలో ఫైన్
- August 29, 2017
అబుదాబిలో ఇరుకు గదుల్లో ఎక్కువ మంది నివసిస్తే, ఆయా ప్రాంతాలపై అక్కడి ప్రభుత్వం దాడులు చేస్తోంది. ఎమిరేట్స్ నివాస నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధిస్తోంది. తెలుగువారు నివసిస్తున్న గృహాలపై దాడులు చేసిన అధికారులు ఒకే రోజు 40 మందికి జరిమానాలు విధించడం వారిలో గుబులు రేపుతోంది. ఉపాధి నిమిత్తం వెళ్తున్న తెలుగువారు వేతనాలు తక్కువగా ఉండటంతో 10 నుంచి 20 మంది ఒకే గదిలో ఉంటున్నారు. చాలా కాలంగా అక్కడ ఈ వ్యవహారం సాగుతుండగా, అబుదాబి ప్రభుత్వం ఇప్పుడు కొరడా ఝలిపిస్తోంది. ఎమిరేట్స్ రెసిడెన్షియల్ నియమా వళి-2011 చట్టం సంఖ్య-1లో పేర్కొన్నట్లుగా అబుదాబి మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్నవారు ఇకపై ఒక గదిలో ముగ్గురికన్నా మించి ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. అపార్ట్మెంట్ లేదా విల్లాలో ఒక కుటుంబం మాత్రమే ఉండాలని, బ్రహ్మచారులైతే ఒక బెడ్ రూమ్లో ముగ్గురు వ్యక్తులే ఉండాలని, వంట గది, కారిడార్, సాధారణ ప్రాంతాల్లో నిద్ర పోవడానికి ఉపయోగించవద్దంటూ ఆదేశాలు వచ్చాయి.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







