రాజస్థాన్‌లో 11 రోడ్‌ ప్రాజెక్టులకు నరేంద్ర మోడీ శంకుస్థాపన

- August 29, 2017 , by Maagulf
రాజస్థాన్‌లో 11 రోడ్‌ ప్రాజెక్టులకు నరేంద్ర మోడీ శంకుస్థాపన

ఏళ్లకు ఏళ్లు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు... దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం లాంటివని ప్రధానమంత్రి నరేంద్ర  మోడీ అన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 15 వేల కోట్ల విలువైన 11 రోడ్‌ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఇందులో 11 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న చంబల్‌ బ్రిడ్జి కూడా ఉంది. కేవలం 300 కోట్లు ఖర్చయ్యే ఈ వంతెనను సైతం ఇన్నేళ్ల పాటు పెండింగ్‌లో ఉంచారని మోడీ మండిపడ్డారు. పనులు మొదలు పెట్టడమే కాదు.. సకాలంలో వాటిని పూర్తు చేయడం కూడా తమ లక్ష్యమేనని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టడం బీజేపీ వైఖరి కాదని మోడీ వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com