పోలీస్ పాత్రలో రాబోతున్న మాస్ మహరాజా
- August 29, 2017
మాస్ మహరాజా రవితేజ మరోసారి పోలీస్ పాత్రలో నటించనున్నాడు. రవితేజ నటించిన బెంగాల్ టైగర్ తర్వాత దాదాపు రెండేళ్ళ గ్యాప్ వచ్చింది. తనకుతానే ఈ గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఒకే సారి రెండు సినిమాలకు సైన్ చేశారు. రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు టైటిల్స్తో రవితేజ కథానాయకుడిగా రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటికి అనీల్ రావిపూడి, విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహిస్తు న్నారు. ఈ చిత్రాల నిర్మాణం చివరిదశలో ఉన్న నేపథ్యంలో రవితేజ మరొక కొత్త చిత్రంలో నటించడానికి అంగీకరించినట్టు తెలిసింది. తమిళంలో విజయవంతమైన బోగన్ అనే చిత్రంలో రవితేజ నటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు హలె చల్ చేస్తున్నాయి. బోగన్ చిత్రంలో జయం రవి హీరోగా నటించాడు. జయం రవి నటించిన తను ఒరువన్ తెలుగులో ధృవగా రీమేక్ అయిన విషయం తెలిసిందే.
బోగన్ చిత్రంలో హీరో పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తాడు. ఈ సినిమా గత ఏడాది విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు రవితేజతో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. విక్రమార్కుడు, పవర్ చిత్రా ల్లో రవితేజ పోలీస్ ఆఫీసర్గా నటించగా, ఇవి భారీ విజయాన్ని నమోదు చేశాయి. ఇక బోగన్ కథలో కొంత మార్పులు చేసి తెలుగులో నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







