పోలీస్ పాత్రలో రాబోతున్న మాస్ మహరాజా
- August 29, 2017
మాస్ మహరాజా రవితేజ మరోసారి పోలీస్ పాత్రలో నటించనున్నాడు. రవితేజ నటించిన బెంగాల్ టైగర్ తర్వాత దాదాపు రెండేళ్ళ గ్యాప్ వచ్చింది. తనకుతానే ఈ గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఒకే సారి రెండు సినిమాలకు సైన్ చేశారు. రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు టైటిల్స్తో రవితేజ కథానాయకుడిగా రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటికి అనీల్ రావిపూడి, విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహిస్తు న్నారు. ఈ చిత్రాల నిర్మాణం చివరిదశలో ఉన్న నేపథ్యంలో రవితేజ మరొక కొత్త చిత్రంలో నటించడానికి అంగీకరించినట్టు తెలిసింది. తమిళంలో విజయవంతమైన బోగన్ అనే చిత్రంలో రవితేజ నటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు హలె చల్ చేస్తున్నాయి. బోగన్ చిత్రంలో జయం రవి హీరోగా నటించాడు. జయం రవి నటించిన తను ఒరువన్ తెలుగులో ధృవగా రీమేక్ అయిన విషయం తెలిసిందే.
బోగన్ చిత్రంలో హీరో పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తాడు. ఈ సినిమా గత ఏడాది విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు రవితేజతో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. విక్రమార్కుడు, పవర్ చిత్రా ల్లో రవితేజ పోలీస్ ఆఫీసర్గా నటించగా, ఇవి భారీ విజయాన్ని నమోదు చేశాయి. ఇక బోగన్ కథలో కొంత మార్పులు చేసి తెలుగులో నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









