జమ్మూ కశ్మీర్ డీఐజీని కదిలించిన జోరా హృదయ వేదన
- August 30, 2017
చిన్న బిడ్డ నిబ్బరంగా ఎలా ఉండగలదు... నాన్న ఒడిలో ఆడుకునే పసిబిడ్డ నాన్న లేకపోతే ఎలా ఉండగలదు..అమ్మ అన్నం పెడుతుంది.. నాన్న ఆడిస్తాడు.. నాన్న లేని తన ప్రపంచాన్ని ఊహించుకుని భోరున విలపించిందా చిట్టి తల్లి... ఆ బంగారు తల్లిని చూస్తే గుండె బరువెక్కిపోతుంది.. తండ్రి దేశం కోసం ప్రాణాలర్పించాడు...బిడ్డను అనాధను చేశాడు. తన నాన్నలేడని, ఇక రాడని శ్రీనగర్ ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అబ్దుల్ రషీద్ కుమార్తె జోరా రోదన ఆ తండ్రికి వినిపించే ఉంటుంది.
జోరా హృదయ వేదన జమ్మూ కశ్మీర్ డీఐజీని కదిలించింది. నువ్వు అంతగా ఏడుస్తుంటే నా గుండె పిండేసినట్లుంది తల్లీ అంటూ తన బాధను ఫేస్బుక్ ద్వారా జోరాకి తెలియజేశారు. ఏం జరిగిందో తెలుసుకునే వయసు కూడా జోరాకి లేదు. తనని ఎలా ఓదార్చాలో కూడా తెలియట్లేదు అని డీఐజ్ అన్నారు. ఎందరో పోలీసులు కుటుంబానికి, కన్నబిడ్డలకు దూరమై దేశం కోసం ప్రాణాలర్పిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఇలాంటి విషయాలే మమ్మల్ని చరిత్రలో గుర్తుండిపోయేలా చేస్తాయని, ఖాకీ దుస్తులు వేసుకున్నప్పుడు దేశానికి చేసిన ప్రతిజ్ఞ మమ్మల్ని వెనకడుగు వేయనీయదని అన్నారు.
తాజా వార్తలు
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!









