సౌదీ మసీదు దుర్ఘటనలో 12 మందికి గాయాలు ఒకరి మృతి
- October 27, 2015
దక్షణ సౌదీ అరబియా ప్రాంతం, నజాన్ లోని షియా మసీదులో ఒక భక్తుని మృతికి, పలువురు గాయాల పాలవడానికి కారణమైన ఆత్మాహుతి బాంబు దాడికి తామే బాధ్యులుగా ఉగ్రవాద ముఠా ఇస్లామిక్ స్టేట్ (ఐ.ఎస్.) ప్రకటించుకుంది. ఈ సంస్థ, సౌదీ అరబియా లో ఉండే మినారిటీ తెగ ఐన ఇస్మైలీ షియైతీ ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపినట్టు ప్రకటించింది. ఈ గ్రూపు, అరబ్ ద్వీపకల్పంలోని పరిపాలకులపై తిరుగుబాటు లేవదీసి, సౌదీ లోని సున్నీ యువతను షియైతీ ల వంటి లక్ష్యాలపై దాడిచేయవలసిందిగా ప్రోత్సహిస్తోంది. ఈ ఘటనా స్థలంలో దొరికిన ఒక తీవ్రవాది తన తల్లిదండ్రులకు రాసిన లేఖలో, ఈ దాడి చేయడానికి నిర్ణయించుకున్నట్టు నిరూపణ అయిందని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా అల్ మాష్హాడ్ మసీదులో సాయంకాల ప్రార్ధనలు ముగించుకొని ప్రజలు బయలుదేరుతుండగా దాడి జరిగిందని అక్కడి స్థానిక ప్రజలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







