హైదరాబాద్ లో ఈ నెల 5న గణేష్ నిమజ్జనం.. జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు
- August 31, 2017
హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 5.. అనంత చతుర్ధశి రోజున నిమజ్జనం జరుగుతుందని జీహెచ్ఎంసీ , భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించింది. గత ఏడాదిలానే.. ఈసారి కూడా ఖైరతాబాద్ మహా గణపతిని అదే రోజు మధ్యాహ్నం కల్లా నిమజ్జనo పూర్తి చేస్తామని తెలిపింది.
హైదరాబాద్లో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది జీహెచ్ఎంసీ. అందులో భాగంగా గ్రేటర్ పరిధిలో కొలువై ఉన్న గణేష్ మండప ఉత్సవ కమిటీలతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్. శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటి పలు సూచనలు చేసింది.
సెప్టెంబర్ 5న హుస్సేన్సాగర్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం సాఫీగా జరగడానికి ట్యాంక్ బండ్ దగ్గర 38 భారీ క్రేన్లను, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు ఉండేలా చర్యలు చేపట్టనుంది జీహెచ్ఎంసీ. వినాయక నిమజ్జన శోభా యాత్ర గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో దాదాపు 354 కిలోమీటర్ల మేర సాగనుంది. అందుకోసం బల్దియా పరిదిలో 168 గణేష్ నిమజ్జనం యాక్షన్ టీం లు...10 వేల మంది శానిటేషన్ కార్మికులు.. 295మంది జవాన్లు... 688 SFA లు పనిచేస్తారని కమిషనర్ తెలిపారు.
మరోవైపు ఎక్కడికక్కడ వినాయక నిమజ్జనం చేయడానికి గత ఏడాది మొదలు పెట్టిన బేబీ పాండ్స్ నిమజ్జన కొలనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై అనేక విమర్శలు వస్తున్నారు. పూర్తైన వాటిలో సాధ్యం అయినంత మేర నీటిని నింపాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలిచ్చారు మేయర్ బొంతు రామ్మోహన్.
అటు.. ఎల్బీ నగర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు మెట్రో రైలు పనుల వల్ల.. రోడ్లు పాడై పోయాయని.. చాల చోట్ల గుంతలు ఉండటంతో శోభా యాత్ర ఆలస్యం అవుతుందని భాగ్యనగర్ ఉత్సవ సమితి.. మేయర్, కమిషనర్ దృష్టికి తెచ్చింది. దాదాపు 60 శాతం శోభాయాత్ర మెట్రో మార్గాల్లో ఉన్నందున తగు చర్యలు తీసుకోవాలని కోరింది. కీలకమైన ఈ సమీక్షా సమావేశంలో మెట్రో రైల్ అధికారులు హాజరుకు కాకపోవడంపై అటు భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితితో పాటు.. మేయర్ అసంతృప్తి వ్యక్తం చేసారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









