ఐదు క్యాంప్ల ఏర్పాటు: ఇండియన్ ఎంబసీ
- September 01, 2017
కాన్సులర్ సేవల్ని అత్యవసరంగా అందించేందుకోసం ఖతార్లో ఇండియన్ ఎంబసీ భారతీయ వలసదారులకు ఉపయోగకరంగా ఉండేందుకు ఐదు క్యాంప్లను ఆగస్ట్లో నిర్వహించింది. సల్వా, మెసైయీద్, అల్ ఖోర్, దుఖాన్, జిక్రీత్ తదితర ప్రాంతాల్లో వీటిని నిర్వహించినట్లు నెలవారీ నిర్వహించే కమ్యూనిటీ హౌస్ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మొత్తం 219 కాన్సులర్ సర్వీసుల్ని ఐదు క్యాంప్ల ద్వారా అందించినట్లు తెలిపారు అధికారులు. వలసదారులకు సంబంధించి పలు సమస్యలకు ఈ క్యాంప్లలో పరిష్కారం చూపగలిగినట్లు వారు వివరించారు. ఇంకో వైపున ఇండియన్ ఎంబసీ టీమ్, డిపోర్టేషన్ సెంటర్నీ, అలాగే సెంట్రల్ ప్రిజన్నీ సందర్శించింది. అక్కడి భారతీయ వలసదారుల సమస్యల్ని ఎంబసీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. జనవరి నుంచి 2017 మొత్తం 8 కమ్యూనిటీ హౌస్ సెషన్స్ నిర్వహించారు. మొత్తం 42 ఫిర్యాదులు ఈ సెషన్స్లో అందాయి. వీటిల్లో 28 ఫిర్యాదులకు పరిష్కారం దొరికింది. 14 ఫిర్యాదులు యాక్టివ్ ఫాలో అప్లో ఉన్నాయి. ఎంబసీ 43 ఎమర్జన్సీ సర్టిఫికెట్లను ఆగస్ట్లో జారీ చేసింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









