నేడు వైఎస్ఆర్ 8వ వర్ధంతి
- September 01, 2017
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 8వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు శనివారం ఉదయం వైకాపా అధినేత జగన్, ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డి తదితరులు వెళ్లారు.
వైఎస్ సమాధి వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వైఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. కాగా, ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఓ ట్వీట్ చేశారు. 'వైఎస్ఆర్ బతికే ఉన్నారు. ఎందుకంటే, ఎందరో జీవితాలను ఆయన మెరుగుపరిచారు... వైఎస్ఆర్ బతికే ఉన్నారు.. ఎందుకంటే, మన హృదయాల్లో ఆయన ఉన్నారు కాబట్టి' అంటూ పేర్కొన్నారు.
అలాగే, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైఎస్ఆర్ అభిమానులు రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. ఈ వర్థంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈసందర్భంగా పలువురు నేతలు వైఎస్ఆర్ చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు. కాగా, 2009 సెప్టెంర్ 2వ తేదీన పావురాలగుట్ట వద్ద జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ చనిపోయిన విషయం తెల్సిందే.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!







