మసీదుపై బాంబుదాడి చేసిన వ్యక్తిని గుర్తించిన సౌదీ అరేబియా

- October 28, 2015 , by Maagulf
మసీదుపై బాంబుదాడి చేసిన వ్యక్తిని గుర్తించిన సౌదీ అరేబియా

దేశ దక్షణ ప్రాంతంలోని ఒక మసీదుపై దాడిచేసిన ఒక పౌరుని తాము గుర్తించామని  సౌదీ అరేబియా అధికారులు తెలిపారు. సోమవారం పొద్దుపోయిన తరువాత ఇస్మైలీ షియైతీ వర్గానికి చెందిన మసీదుపై  జరిగిన ఈ దాడిలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. సైట్ ఇంటలిజెన్స్ గ్రూప్ వారి  నివేదిక ప్రకారం, డేఇష్ సంస్థకు చెందిన "హిజాజ్ ప్రావిన్స్" వారు ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇది మే నెల నుండి సౌదీ మసీదులపై వారి నాలుగవ దాడి. ఈ గ్రూపు షియైతీ లను సంప్రదాయ వ్యతిరేకులుగా, రాజ్యాన్ని బలహీన పరిచేవారి గా భావిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com