వెడ్డింగ్, ఎంఐసిఇ డెస్టినేషన్గా బహ్రెయిన్
- September 04, 2017
మనామా: బహ్రెయిన్ని వెడ్డింగ్ మరియు ఈవెంట్స్కి సంబంధించి డెస్టినేషన్గా మార్చేందుకోసం ఐలాండ్స్, బీచ్లు, ఎడారి ప్రాంతాల్ని ప్రమోట్ చేయాలని బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటోంది. ఇండియాలో ఇటీవలి కాలంలో విదేశాల్లో ఈవెంట్స్ నిర్వహణ పట్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈవెంట్స్కి కూడా డెస్టినేషన్స్ ప్లానింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే బహ్రెయిన్, ఆ అవకాశాన్ని అందుపుచ్చుకోవాలనుకుంటోంది. భారత్ నుంచి బహ్రెయిన్కి వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న దరిమిలా, డెస్టినేషన్ టూరిజం సౌకర్యాల్ని మరింత మెరుగుపర్చడం, అలాగే ఆయా ప్రాంతాల్ని ఇంకాస్త ఎక్కువగా ప్రమోట్ చేయడం వంటి వాటి ద్వారా భారతలోని డెస్టినేషన్ లవర్స్ని ఆకట్టుకోవాలని చూస్తున్నట్లు బిటిఇఎ వెల్లడించింది. వెయ్యేళ్ళకుపైగానే ఇండియాతో బహ్రెయిన్కి సన్నిహిత సంబంధాలున్నాయనీ, డెస్టినేషన్ వెడ్డింగ్స్తో ఆ సంబంధాలు ఇంకా బలోపేతం అవుతాయని వారు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ, ముంబై సహా పలు ముఖ్యమైన నగరాల్లో బహ్రెయిన్ డెస్టినేషన్ గురించిన ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టడానికి పలు కార్యక్రమాలకు వ్యూహరచన చేస్తోంది బిటిఇఎ.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







