హరికేన్ హార్వీ కారణంగా టెక్సాస్కు పర్యావరణ ముప్పు
- September 05, 2017
హరికేన్ హార్వీ సృష్టించిన అలజడికి కకావికలమైన అమెరికా రాష్ట్రం టెక్సాస్కు ఇప్పుడు పర్యావరణ ముప్పు పొంచిఉంది. హరికేన్ హార్వీ బీభత్సంతో మరణించిన వారి సంఖ్య 60కి చేరింది. మొత్తంగా అమెరికా అర్థిక వ్యవస్థకు హార్వీ కారణంగా సుమారు రూ.11.54 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. కాగా, హరికేన్ హార్వీ వల్ల సంభవించిన పర్యవరణ మార్పులతో అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
సురక్షిత ప్రాంతాల నుంచి తమ ఇళ్లకు చేరుకున్న ప్రజలు బాటిల్ వాటర్నే తాగాలని, సర్జికల్ మాస్క్లు, కాలివేళ్లను మూసి ఉంచే షూస్, చేతి తొడుగులను వినియోగించాలని సూచించారు. కరీబియన్ దీవుల వైపుగా హరికేన్ ఇర్మా దూసుకువస్తోందని అమెరికా వాతావరణ విభా గం హెచ్చరించింది. కేటగిరి 4 తీవ్రత గల ఈ హరికేన్ ప్రభావం ప్యూర్టోరికో, ఫ్లోరిడా, కరీబియన్ దీవులపై ఎక్కువ ఉంటుందని, గంటకు 240 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా పలు విమాన సర్వీసులను రద్దు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







