27న బెజవాడకు తెలంగాణ సీఎం
- September 05, 2017
కనకదుర్గమ్మకు ముక్కు పుడక సమర్పించనున్న కేసీఆర్
ఢిల్లీ నుంచి రాగానే పర్యటన ఖరారు
విజయదశమి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారి మొక్కును తీర్చుకోవడానికి సీఎం కేసీఆర్ ఈనెల 27వ తేదీన విజయవాడ వెళ్లనున్నట్లు తెలిసింది. కుటుంబ సమేతంగా అమ్మవారికి ముక్కు పుడకను సమర్పించనున్నారు. ఇప్పటికే వరంగల్లోని భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం, తిరుపతి తిరుచానూరులోని పద్మావతి అమ్మవారికి ముక్కు పుడక, కురవిలోని వీరభద్రస్వామికి బంగారు మీసాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మొక్కులు తీర్చుకుంటానని కేసీఆర్ ప్రకటించగా.. అందుకోసం రాష్ట్రం వచ్చిన తర్వాత రూ.59 లక్షలు కేటాయించారు. ఇందులో భాగంగా అన్ని దేవాలయాలను దర్శించుకున్న ఆయన ఒక్క విజయవాడలో అడుగుపెట్టలేదు.
గతేడాదే పర్యటన ఉంటుందని భావించినప్పటికీ కుదరలేదు. సీఎం ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చాక విజయవాడ పర్యటనను ఖరారు చేయనున్నారు. ఈనెల 27న ఏపీ ప్రభుత్వం కూడా కనకదుర్గమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనుంది. అదే రోజు సీఎం కేసీఆర్ కూడా ముక్కు పుడకను సమర్పించి.. మొక్కు తీర్చుకోను.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









