మునిగిపోతున్న వెస్సెల్‌: 20 మంది సెయిలర్స్‌ క్షేమం

- September 06, 2017 , by Maagulf
మునిగిపోతున్న వెస్సెల్‌: 20 మంది సెయిలర్స్‌ క్షేమం

మస్కట్‌: ఇరవై మంది సెయిలర్లుమునిగిపోతున్న షిప్‌ నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఫిషర్‌మెన్‌ ఒకరు వీరిని రక్షించారు. రాయల్‌ ఒమన్‌ పోలీసులు ఈ వివరాల్ని వెల్లడించారు. అల్‌ వుస్తా తీరంలో మర్చంట్‌ షిప్‌ ఒకటి మునిగిపోయింది. టాంజానియన్‌ ఫ్లాగ్‌డ్‌ షిప్‌ ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. యూఏఈ నుంచి పోర్ట్‌ ఆఫ్‌ ఎరిత్రియాకి వెళుతూ షిప్‌ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్‌ని ఈ షిప్‌ తీసుకెళుతోంది. ఈ షిప్‌లో వివిధ దేశాలకు చెందినవారు పనిచేస్తున్నారు. పడగ మునిగిపోతున్న విషయాన్ని పోలీసులకు తెలిపి, అలర్ట్‌ చేసిన ఫిషర్‌మెన్‌, అంతమందిని రక్షించినందుకు గర్వంగా ఉందని అన్నారు. సెయిలర్స్‌ని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు అధికారులు. సెయిలర్స్‌ని రీపాట్రియేట్‌ చేసేందుకోసం సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com