కొత్త రక్తం, కొత్త ఆలోచనలే కీలకం
- September 06, 2017
యుఏఈ: వైస్ ప్రెసిడెంట్, ఐమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్, తన కార్యాలయంలో క్రియేటివ్ మీటింగ్ సందర్భంగా, కొత్త రక్తం సరికొత్త ఆలోచనలతో వచ్చినప్పుడే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందనీ, నూతన ఆవిష్కరణలకు ఆస్కారమేర్పడుతుందని చెప్పారు. యువతే సరికొత్త ఆవిష్కరణలకు మార్గనిర్దేశకులని ఆయన కొనియాడారు. ప్రపంచం అత్యంత వేగంగా టెక్నాలజీ సహా అనేక రంగాల్లో పురోగమిస్తోందనీ, యువత మెరుగైన అవకాశాల్ని అందిపుచ్చుకోవడంతోపాటు, కొత్త కొత్త ఆవిష్కరణలతో సత్తా చాటవలసి ఉందని, వారిని ఆ వైపుగా ప్రోత్సహించడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో పలు విభాగాలు దేశాభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారాయన. భవిష్యత్తులో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులు, ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు దేశాన్ని మరింతగా ముందుకు తీసుకెళతాయని వివరించారు. అభివృద్ధి, ఆవిష్కరణలు, సంక్షేమం దేశ ప్రగతిని నిర్దేశిస్తాయని చెప్పారు షేక్ మొహమ్మద్.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







