కొత్త రక్తం, కొత్త ఆలోచనలే కీలకం

- September 06, 2017 , by Maagulf
కొత్త రక్తం, కొత్త ఆలోచనలే కీలకం

యుఏఈ: వైస్‌ ప్రెసిడెంట్‌, ఐమ్‌ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌, తన కార్యాలయంలో క్రియేటివ్‌ మీటింగ్‌ సందర్భంగా, కొత్త రక్తం సరికొత్త ఆలోచనలతో వచ్చినప్పుడే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందనీ, నూతన ఆవిష్కరణలకు ఆస్కారమేర్పడుతుందని చెప్పారు. యువతే సరికొత్త ఆవిష్కరణలకు మార్గనిర్దేశకులని ఆయన కొనియాడారు. ప్రపంచం అత్యంత వేగంగా టెక్నాలజీ సహా అనేక రంగాల్లో పురోగమిస్తోందనీ, యువత మెరుగైన అవకాశాల్ని అందిపుచ్చుకోవడంతోపాటు, కొత్త కొత్త ఆవిష్కరణలతో సత్తా చాటవలసి ఉందని, వారిని ఆ వైపుగా ప్రోత్సహించడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో పలు విభాగాలు దేశాభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారాయన. భవిష్యత్తులో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులు, ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు దేశాన్ని మరింతగా ముందుకు తీసుకెళతాయని వివరించారు. అభివృద్ధి, ఆవిష్కరణలు, సంక్షేమం దేశ ప్రగతిని నిర్దేశిస్తాయని చెప్పారు షేక్‌ మొహమ్మద్‌. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com