హ్యాకింగ్: 1.8 మిలియన్ దిర్హామ్ల ట్రాన్స్ఫర్
- September 06, 2017
దుబాయ్: ఓ హ్యాకర్, అమెరికాకి చెందిన ఓ వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుంచి, దుబాయ్లోని ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీకి పెద్ద మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 2013 మార్చిలో సీటెల్లోని బ్యాంక్ అకౌంట్ని హ్యాక్ చేసి, 500,000 డాలర్లు (1.3 మిలియన్ దిర్హామ్లు) మూడు ఇన్స్టాల్మెంట్స్లో కంపెనీకి చెందిన బ్యాంక్ అకౌంట్కి మళ్ళించినట్లు అధికారులు గుర్తించారు. హ్యాకింగ్ని గుర్తించిన అమెరికన్, సదరు సంస్థను సంప్రదించి ఆ మొత్తాన్ని తిరిగి తన అకౌంట్కి బదలాయించాల్సిందిగా కోరినా, ఆ కంపెనీ అందుకు సమ్మతించలేదు. దాంతో ఆ అమెరికన్, లీగల్ కన్సల్టెంట్ని ఆశ్రయించారు. లీగల్ కన్సల్టెంట్ హస్సన్ ఎల్హాఆయిస్ సివిల్ కేస్ వేస్తూ, కంపెనీపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం, 250,000 డాలర్లను బాదితుడికి చెల్లించాల్సిందిగా కంపెనీకి ఆదేశించింది. అలాగే 9 శాతం వడ్డీ చెల్లించాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







