మాంసంలో మోసం..వ్యర్ధాలను రెస్టారెంట్లకు విక్రయిస్తున్న ప్రవాసీయుల అరెస్టు
- September 07, 2017
మస్కట్ : ధనార్జనే పరమావధిగా భావించిన కొందరు ప్రవాసీయులు కక్కుర్తి ఆదాయం కోసం అర్రులు చాచి ...చివరకి కారాగారంలో ఊచలు లెక్కబెడుతున్నారు. రస్టాక్ లోని మాంసం అమ్మే వివిధ కబేళాలలో మేకలు, గొర్రెలు తదితర జంతువుల తలలు, తోకలు, కాలి గిట్టలు తదితర పారవేసిన మాంస వ్యర్ధాలను పెద్ద ఎత్తున సేకరించి ముసున్నహ్ సమీపంలోని విలాయత్ లో అద్దెకు తీసుకున్న పొలంలో వాటిని మరోమారు శుభ్రపర్చి వాటి నుంచి మరల మాంసాన్ని సేకరించి పలు రెస్టారెంట్లకు తాజా మాంసంగా విక్రయిస్తున్నారు. ఈ తరహా మోసాన్ని పసిగట్టిన పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (పీఏసీపీ) ఈ మాంస మోసంతో సంబంధం ఉన్న కొంతమంది ప్రవాసీయులను అరెస్టు చేసింది. ఈ అరెస్టులు రాయల్ ఒమాన్ పోలీసులు మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సహకారంతో వారిని అదుపులోనికి తీసుకొన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







