కువైట్ లో ముగిసిన మధ్యాహ్న పని నిషేధం
- September 08, 2017
కువైట్ : వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్యకాలంలో పని నిషేధం అమలు ఆగస్టు 31 వ తేదీతో ముగిసినట్లు మానవ వనురుల సంస్థ ప్రకటించింది. తీవ్రమైన వేసవి అనంతరం సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి సాధారణ రీతిలోనే ఇక పని గంటలు తిరిగి ప్రారంభించేందుకు కార్మికులు అనుమతించబడ్డారు. కార్మికులు ఆరోగ్యాన్ని పరిగణన లోనికి తీసుకొని ప్రత్యేకించి బహిరంగ ప్రదేశాల్లోని నిర్మాణ ప్రదేశాల్లో ఎండలలో పని కార్మికుల పని చేయడం నిషేధించారు. బహిరంగ ప్రదేశాల్లో కార్మికులతో తీవ్రమైన ఎండలలో బలవంతంగా పనిచేయడం లేదని నిర్ధారించడానికి మానవ వనురుల సంస్థ తనిఖీ అధికారులను నియమించింది. అన్ని గవర్నరీలలో తనిఖీ బృందాలు వివిధ పని ప్రదేశాలలో పర్యవేక్షించాయని ప్రతి ఒక్కరూ నిబంధనలకు కట్టుబడి ఉన్నారని మరియు అలాగే పని నిషేధం ఉల్లంఘించినవారికి హెచ్చరిక నోటీసులు అందించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









