కువైట్ లో ముగిసిన మధ్యాహ్న పని నిషేధం

- September 08, 2017 , by Maagulf
కువైట్ లో ముగిసిన మధ్యాహ్న పని నిషేధం

కువైట్ : వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్యకాలంలో పని నిషేధం అమలు ఆగస్టు 31 వ తేదీతో ముగిసినట్లు మానవ వనురుల సంస్థ ప్రకటించింది.  తీవ్రమైన వేసవి అనంతరం  సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి   సాధారణ రీతిలోనే ఇక పని గంటలు  తిరిగి ప్రారంభించేందుకు కార్మికులు అనుమతించబడ్డారు. కార్మికులు ఆరోగ్యాన్ని పరిగణన లోనికి తీసుకొని ప్రత్యేకించి బహిరంగ ప్రదేశాల్లోని నిర్మాణ ప్రదేశాల్లో ఎండలలో పని కార్మికుల పని చేయడం నిషేధించారు. బహిరంగ ప్రదేశాల్లో కార్మికులతో  తీవ్రమైన ఎండలలో బలవంతంగా పనిచేయడం లేదని నిర్ధారించడానికి మానవ వనురుల సంస్థ  తనిఖీ అధికారులను నియమించింది. అన్ని గవర్నరీలలో తనిఖీ బృందాలు వివిధ పని ప్రదేశాలలో పర్యవేక్షించాయని ప్రతి ఒక్కరూ నిబంధనలకు కట్టుబడి ఉన్నారని మరియు అలాగే పని నిషేధం  ఉల్లంఘించినవారికి హెచ్చరిక నోటీసులు అందించినట్లు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com