భారత్ లో విమాన సిబ్బందిని దూషిస్తే కఠిన చర్యలు
- September 08, 2017
ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడబోమని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ఎయిర్ పోర్టుల్లో అదుపు తప్పుతున్న ఎంపీల ప్రవర్తన, విమాన సంస్థల బ్యాన్ వంటి అంశాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఓ నియమావళిని కేంద్రం రూపొందించింది. సిబ్బందిని దూషిస్తే.. మూడు నెలల పాటు ఆ వ్యక్తిని విమానం ఎక్కనివ్వరు. భౌతిక దాడికి పాల్పడితే.. ఆరు నెలలు నిషేధం విధిస్తారు. చంపేస్తామంటూ బెదిరిస్తే.. కనీసం రెండేళ్ల నుంచి లైఫ్ టైం బ్యాన్ అమలు చేస్తారు. DGCA దగ్గర నమోదైన అన్ని సంస్థలతో పాటు.. విదేశీ ఎయిర్ లైన్స్ సైతం వీటిని పాటించాల్సి ఉంటుంది. ప్రపంచంలో తొలిసారిగా ఈ విధానం తీసుకొచ్చినట్టు మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







