భారత్ లో విమాన సిబ్బందిని దూషిస్తే కఠిన చర్యలు
- September 08, 2017
ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడబోమని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ఎయిర్ పోర్టుల్లో అదుపు తప్పుతున్న ఎంపీల ప్రవర్తన, విమాన సంస్థల బ్యాన్ వంటి అంశాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఓ నియమావళిని కేంద్రం రూపొందించింది. సిబ్బందిని దూషిస్తే.. మూడు నెలల పాటు ఆ వ్యక్తిని విమానం ఎక్కనివ్వరు. భౌతిక దాడికి పాల్పడితే.. ఆరు నెలలు నిషేధం విధిస్తారు. చంపేస్తామంటూ బెదిరిస్తే.. కనీసం రెండేళ్ల నుంచి లైఫ్ టైం బ్యాన్ అమలు చేస్తారు. DGCA దగ్గర నమోదైన అన్ని సంస్థలతో పాటు.. విదేశీ ఎయిర్ లైన్స్ సైతం వీటిని పాటించాల్సి ఉంటుంది. ప్రపంచంలో తొలిసారిగా ఈ విధానం తీసుకొచ్చినట్టు మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









