చెత్తా చెదారాలను రోడ్లపై విసిరే డ్రైవర్లకు రస్ అల్ ఖైమాలో భారీ జరిమానాలు సిద్ధం
- September 08, 2017
రస్ అల్ ఖైమా: వాహనాలను నడిపే సమయంలో వాహనదారులు, ప్రయాణీకులు ఎవరైతే రోడ్లపైకి చెత్తా చెదారాలను పారవేస్తారో వారికి కొత్త ట్రాఫిక్ రెగ్యులేషన్ విధాన ప్రకారం 1,000 ధిర్హాం ల జరిమానా విధించదమే కాక సంబంధిత డ్రైవర్ లైసెన్స్ పై ఆరు నల్లని చుక్కలు చేర్చనున్నట్లు రస్ అల్ ఖైయామా పోలీసులు చెప్పారు. రస్ అల్ ఖైమా పోలీసుల ట్రాఫిక్ మరియు గస్తీ శాఖ సాధారణ సేవల శాఖ సమావేశం తర్వాత ఈ విషయాన్నీ వెల్లడించారు.ఈ ఏడాది ప్రారంభంలో తమ తమ కారుల నుంచి సిగరెట్ పెట్టెలను రోడ్డుపైకి విసిరివేస్తూ పలువురు వాహనదారులు పోలీసులకు పట్టుబడ్డారు. దాంతో దుబాయ్ పోలీసులు వారికి 1,000 ధిర్హాం ల జరిమానా విధించదమే కాక సంబంధిత డ్రైవర్ లైసెన్స్ పై ఆరు నల్లని చుక్కలు పెట్టారు. ఇది తొలినాళ్లలో 500 ధిర్హాం జరిమానాగా ఉండేది. ఆ తర్వాత దుబాయ్ పోలీసులు ఇదే విధమైన జరిమానాతో శిక్షించబడ్డారు. ఎమిరేట్స్ లోని టాఫిక్ ప్రచారంలో భాగంగా రోడ్డులను కలుషితం చేయటం, భద్రత మరియు అగ్ని ప్రమాదాలు సృష్టించే విధంగా వాహనాలను నడిపేవారిని నిలువరించేందుకు ఈ తరహా చర్యలు తీసుకోనున్నారు. దుబాయ్ మునిసిపాలిటీ ఏప్రిల్ నెలలో కేవలం ఒకే ఒక రోజున షేక్ జాయెద్ రోడ్డులో 30 కిలోల బరువు తూగే పారవేసిన సిగరెట్ల వ్యర్థాలను సేకరించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!









