చెత్తా చెదారాలను రోడ్లపై విసిరే డ్రైవర్లకు రస్ అల్ ఖైమాలో భారీ జరిమానాలు సిద్ధం
- September 08, 2017
రస్ అల్ ఖైమా: వాహనాలను నడిపే సమయంలో వాహనదారులు, ప్రయాణీకులు ఎవరైతే రోడ్లపైకి చెత్తా చెదారాలను పారవేస్తారో వారికి కొత్త ట్రాఫిక్ రెగ్యులేషన్ విధాన ప్రకారం 1,000 ధిర్హాం ల జరిమానా విధించదమే కాక సంబంధిత డ్రైవర్ లైసెన్స్ పై ఆరు నల్లని చుక్కలు చేర్చనున్నట్లు రస్ అల్ ఖైయామా పోలీసులు చెప్పారు. రస్ అల్ ఖైమా పోలీసుల ట్రాఫిక్ మరియు గస్తీ శాఖ సాధారణ సేవల శాఖ సమావేశం తర్వాత ఈ విషయాన్నీ వెల్లడించారు.ఈ ఏడాది ప్రారంభంలో తమ తమ కారుల నుంచి సిగరెట్ పెట్టెలను రోడ్డుపైకి విసిరివేస్తూ పలువురు వాహనదారులు పోలీసులకు పట్టుబడ్డారు. దాంతో దుబాయ్ పోలీసులు వారికి 1,000 ధిర్హాం ల జరిమానా విధించదమే కాక సంబంధిత డ్రైవర్ లైసెన్స్ పై ఆరు నల్లని చుక్కలు పెట్టారు. ఇది తొలినాళ్లలో 500 ధిర్హాం జరిమానాగా ఉండేది. ఆ తర్వాత దుబాయ్ పోలీసులు ఇదే విధమైన జరిమానాతో శిక్షించబడ్డారు. ఎమిరేట్స్ లోని టాఫిక్ ప్రచారంలో భాగంగా రోడ్డులను కలుషితం చేయటం, భద్రత మరియు అగ్ని ప్రమాదాలు సృష్టించే విధంగా వాహనాలను నడిపేవారిని నిలువరించేందుకు ఈ తరహా చర్యలు తీసుకోనున్నారు. దుబాయ్ మునిసిపాలిటీ ఏప్రిల్ నెలలో కేవలం ఒకే ఒక రోజున షేక్ జాయెద్ రోడ్డులో 30 కిలోల బరువు తూగే పారవేసిన సిగరెట్ల వ్యర్థాలను సేకరించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









