47 మద్యం సీసాలతో బంగ్లాదేశ్ దేశస్థుడు అరెస్టు; 40 మంది అక్రమ నివాసితులు పట్టివేత
- September 08, 2017
కువైట్ సిటీ: స్థానికంగా తయారుచేసిన 47 మద్యం సీసాలతో దొరికిపోయిన ఒక బంగ్లాదేశ్ దేశస్థుడిని పోలీసులు అరెస్టు చేశారు.భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ఫెర్వనియా భద్రతా సిబ్బంది ఫెర్వానియా ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో గస్తీ అధికారులను గమనించిన ఆసియా దేశానికి చెందిన ఒక ప్రవాసీయుడు పరుగు పెట్టడం ప్రారంభించాడు. దాంతో అనుమానించిన ఆ అధికారులు ఆ వ్యక్తిని ఆపి అతని సంచిని తనిఖీ చేయగా 47 నీటి సీసాలలో స్థానికంగా తయారు చేయబడిన మద్యంను నింపాడు. దీనితో ఆ నిందితుడిని సంబంధిత అధికారులకు మద్యం సీసాలతో అరెస్టు చేసి అవసరమైన చట్టపరమైన చర్య కొరకు న్యాయాధికారుల ఎదుట ప్రస్తావించారు. ఇదే నేపథ్యంలో మరో నేపాల్ ప్రవాసీయుడిని అబల్ హాలిఫా ప్రాంతంలో స్థానికంగా తయారుచేసిన12 మద్యం సీసాలతో అరెస్ట్ చేశారు.ఆ నిందితుడిని మద్యం సీసాలతో సహా సంబంధిత అధికారులకు తదుపరి దర్యాప్తు నిమిత్తం అప్పగించారు.ఇటీవల జరిపిన భద్రత ప్రచారంలో భాగంగా జహ్రా సెక్యూరిటీ డైరెక్టరేట్ కు చెందిన అధికారులు పౌర, క్రిమినల్ నేరాలకు సంబంధించిన చట్టం ద్వారా కోరిన 5 వ్యక్తులతో సహా ఏ విధమైన గుర్తింపును చూపించలేని 40 మంది అక్రమ నివాసితులను పట్టుకున్నట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు. అదేవిధంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న15 మంది వాహనదారులను అరెస్ టుచేశారు గ్యారేజీలలో దాచిన వారి వాహనాలు ఈ సందర్భంగా స్వాధీనం చేసుకొన్నారు.రహదారి వినియోగదారులు మరియు నివాసితుల భద్రతకు వీలు కల్పించడానికి ఒక గరిష్ట కాల వ్యవధిలో గవర్నరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో ప్రచారం కొనసాగుతుందని భద్రతా అధికారులు పేర్కొన్నారు..
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









