'గల్ఫ్' నిర్వాసితులకు ఆత్మీయ స్వాగతం
- September 08, 2017
శంషాబాద్: ఓమాన్ దేశంలో ఉద్యోగాలు కోల్పోయి ఉత్తిచేతులతో స్వదేశం చేరిన గల్ఫ్ వలసకార్మికులకు ప్రోటోకాల్ అధికారులు, తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నంగి దేవేందర్ రెడ్డి, డా. అస్మా ఖాన్ లు శనివారం ఉదయం హైదరాబాద్ ఏర్ పోర్ట్ లో ఆత్మీయ స్వాగతం పలికారు. ఒమాన్ లో పెట్రాన్ గల్ఫ్ అనే కంపెనీ మూసేయడం వలన 50 మంది తెలంగాణ కార్మికులు రోడ్డున పడ్డారు. వీరిలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన బాలపెల్లి గంగారెడ్డి, కరీంనగర్ జిల్లా మంకమ్మతోటకు చెందిన బింగి రవి అనే ఇద్దరు కార్మికులు ఇండియన్ ఎంబసీ సహాయంతో ఉచిత విమాన ప్రయాణ టికెట్టు పొంది శనివారం హైదరాబాద్ కు చేరుకున్నారు. వీరు హైదరాబాద్ నుండి స్వగ్రామాలకు చేరుకోవడానికి తెలంగాణ ఎన్నారై అధికారి చిట్టిబాబు బస్ చార్జీలు చెల్లించారు.
పునరావాసం కల్పించాలి.
జీతం బకాయిలు, గ్రాట్యుటీ కలిపి ఒక్కొక్కరు 3 లక్షల రూపాయలు నష్టపోయి ఇంటికి చేరారని, ప్రభుత్వం వీరికి పునరావాసం కలిపించాలని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కంపెనీ యాజమాన్యం నుండి బకాయిలను రాబట్టుకోవడానికి కార్మికులు లేబర్ కోర్టులో కేసు వేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో న్యాయ సహాయం చేయాలని ఆయన కోరారు.
బాధితుల ఫోన్ నెంబర్లు: బాలపెల్లి గంగారెడ్డి 99499 36795 బింగి రవి 96033 50632
ఇట్లు: నంగి దేవేందర్ రెడ్డి 81436 88886


తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









