7 మిలియన్ దిర్హామ్ రాఫిల్ విన్నర్: ప్రైజ్ మనీ షేరింగ్
- September 10, 2017
యు.ఏ.ఈ:7 మిలియన్ దిర్హామ్ల బంపర్ ప్రైజ్ని రఫాలే డ్రాలో గెలుచుకున్న మాథ్యూ, ఎట్టకేలకు ఈ బంపర్ ప్రైజ్ దక్కించుకోవడంపై స్పందించారు. తన ఫోన్ నీటిలో పడిపోవడంతో బిగ్టికెట్ నిర్వాహకులు తనను సంప్రదించలేకపోయారనీ, ఆ తర్వాత వారు తనతో కమ్యూనికేట్ చేశారని తెలిపారు మాథ్యూ. కేరళలోని కొచ్చికి చెందిన మాథ్యూ, తాను గెలుచుకున్న బంపర్ ప్రైజ్ మనీని ఇద్దరు స్నేహితులతో పంచుకోన్నుట్లు చెప్పారు. అందులో ఒకర భారతీయ వ్యక్తి కాగా, మరొకరు పాకిస్తానీ వ్యక్తి. ఆ ఇద్దరూ తాను టికెఎ్కట్ కొనుగోలు చేయడానికి సాయం చేశారని మాథ్యూ చెప్పారు. తాను గెలుచుకున్న 7 మిలియన్ దిర్హామ్లలో 3.5 మిలియన్ దిర్హామ్ని ఆ ఇద్దరికీ ఇవ్వనున్నాని మాథ్యూ వివరించారు. గెల్చుకున్న ప్రైజ్ మనీతో ఏం చేయాలనేదానిపై ఇంకా నిర్ణయించుకోలేదనీ, తన కుమారుడు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాడనీ, కుమార్తె ప్రత్యేకావసరాలు గల వ్యక్తి అని మాథ్యూ వెల్లడించారు. సెప్టెంబర్ 17న మాథ్యూ అల్ అయిన్కి తిరిగి రానున్నారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







