7 మిలియన్ దిర్హామ్ రాఫిల్ విన్నర్: ప్రైజ్ మనీ షేరింగ్
- September 10, 2017
యు.ఏ.ఈ:7 మిలియన్ దిర్హామ్ల బంపర్ ప్రైజ్ని రఫాలే డ్రాలో గెలుచుకున్న మాథ్యూ, ఎట్టకేలకు ఈ బంపర్ ప్రైజ్ దక్కించుకోవడంపై స్పందించారు. తన ఫోన్ నీటిలో పడిపోవడంతో బిగ్టికెట్ నిర్వాహకులు తనను సంప్రదించలేకపోయారనీ, ఆ తర్వాత వారు తనతో కమ్యూనికేట్ చేశారని తెలిపారు మాథ్యూ. కేరళలోని కొచ్చికి చెందిన మాథ్యూ, తాను గెలుచుకున్న బంపర్ ప్రైజ్ మనీని ఇద్దరు స్నేహితులతో పంచుకోన్నుట్లు చెప్పారు. అందులో ఒకర భారతీయ వ్యక్తి కాగా, మరొకరు పాకిస్తానీ వ్యక్తి. ఆ ఇద్దరూ తాను టికెఎ్కట్ కొనుగోలు చేయడానికి సాయం చేశారని మాథ్యూ చెప్పారు. తాను గెలుచుకున్న 7 మిలియన్ దిర్హామ్లలో 3.5 మిలియన్ దిర్హామ్ని ఆ ఇద్దరికీ ఇవ్వనున్నాని మాథ్యూ వివరించారు. గెల్చుకున్న ప్రైజ్ మనీతో ఏం చేయాలనేదానిపై ఇంకా నిర్ణయించుకోలేదనీ, తన కుమారుడు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాడనీ, కుమార్తె ప్రత్యేకావసరాలు గల వ్యక్తి అని మాథ్యూ వెల్లడించారు. సెప్టెంబర్ 17న మాథ్యూ అల్ అయిన్కి తిరిగి రానున్నారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







